న్యూశాయంపేట, సెప్టెంబర్ 21 : ఏకకాలంలో నాలుగు భిన్నమైన ప్రజా ఉద్యమాలతో కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ముడిపడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండ హంటర్రోడ్లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్టు భవన్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతిని ఘనంగా నిర్వహిం చారు. ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి, ప్రభు త్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పూలమాల వేసి నివాళులర్పిం చారు.
ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ ఆశ యాలకు అనుగుణంగా పనిచేస్తున్నదని అన్నారు. జీవితాంతం తెలంగాణ సమస్యలపై పోరాటం చేసిన బాపూజీ తెలంగాణ పక్షపా తి అన్నారు. చేనేత కార్మికుల జీ వితాల్లో వెలుగులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచిస్తున్నదని, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దొ రుకుతుందన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బాపూజీ ఆశయాల మేరకు ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు.
ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకో వాలని కోరారు. మేయర్ గుండు సుధారాణి మా ట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చే స్తూనే మరోవైపు వృత్తిదారుల దయనీయ స్థితిగతు లను మెరుగుపర్చేందుకు వారిలో ఆత్మైస్థెర్యం నిం పడానికి సహకార ఉద్యమాన్ని చేపట్టారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాము లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మా రావు, 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దాసరి ప్రేమ్సాగ ర్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెం కటేశ్వర్లు, సీనియర్ జర్నలిస్ట్ ఢింబాయ్, వేముల సదానందం, చందా మల్లయ్య, వెల్ది సాంబయ్య, గాడిపెల్లి రాజేశ్వర్రావు, గణేశ్ పాల్గొన్నారు.