రాయపర్తి, సెప్టెంబర్ 18 : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ వ్యాక్సిన్ అందించాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది కరో నా వ్యాక్సిన్ను దుర్వినియోగం చేయవద్దన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గారె న ర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎం పీవో తుల రామ్మోహన్, పంచాయతీ కా ర్యదర్శి గుగులోత్ అశోక్నాయక్, వైద్యారోగ్య సిబ్బంది జయలత, ఉబ్బని రజిత, శ్రీలక్ష్మి, అస్గర్అలీ పాల్గొన్నారు.
మండలంలోని రాయపర్తి, మహబూబ్నగర్, కొత్తూరు, పెర్కవేడు, ఊకల్, మై లారం, కొండూరు, కాట్రపల్లి, కేశవాపు రం, సన్నూరు, మొరిపిరాల గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంలు ప్రతికంఠం జయలత, శోభారాణి, జ్యోతి, పెం డ్యాల అరుణ, వస్కుల శారమ్మ, అయిత అరుణ, బాసాని స్వర్ణకుమారి, బూడిద సునీత, మంజుల, భూక్యా ఝాన్సీ, సునీ త, రేణుక ప్రజలకు వ్యాక్సిన్ చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ధరావత్ భీమానాయక్, బానోత్ హరిసింగ్, రాం బో మాధవి, మణెమ్మ పర్యవేక్షిస్తున్నారు.
వర్ధన్నపేట : మున్సిపాలిటీ పరిధిలోని డీసీతండా, భవానికుంటతండాల్లో ఏర్పా టు చేసి కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అ రుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, సీఐ సదన్కుమార్, మున్సిపల్ కమిషనర్ గొడిశా ల రవీందర్, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, ఎస్ ఐ రామారావు పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్ : మండలంలో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. గురిజాలలో వ్యాక్సినేషన్ తీరును ఎంపీటీసీ బండారు శ్రీలత పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కరీమాబాద్ : వ్యాక్సినేషన్తోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ అన్నారు. కార్పొరేటర్లు ము ష్కమల్ల అరుణ, మరుపల్ల రవి, పల్లం పద్మ డివిజన్లలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో గొలనుకొండ ఉపేంద్ర, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కాశీబుగ్గ : కొవిడ్ టీకాలను 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ కోరా రు. 20వ డివిజన్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఇక్బాల్, పెండ్యాల కొమురయ్య, పిట్టల ఉపేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
పర్వతగిరి : మండలంలోని రాంపూర్లో సర్పంచ్ బండి సంతోష్, ఉపసర్పం చ్ అమ్మిలాల్, దేవీలాల్ తండాలో రైతు బంధు సమితి జిల్లా బాధ్యుడు చింతపట్ల సోమేశ్వర్రావు, గోపనపల్లిలో మహాత్మా గాంధీ సేవా సమితి ట్రస్టు చైర్మన్ మిట్టప ల్లి నాగార్జున వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. గోపనపల్లిలో వ్యాక్సిన్ వేసుకున్న వారికి ట్రస్టు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేణు, రాము, లోకేశ్, విజయ్, అఖిల, కిరణ్, వి నయ్, నరేశ్, సుమన్, వైద్య సిబ్బంది రజి త, మంజుల, నర్సమ్మ పాల్గొన్నారు.