దుగ్గొండి/కరీమాబాద్, సెప్టెంబర్ 16: జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ సమక్షంలో గుడిమహేశ్వరంలో గురువారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తొగరు సాంబయ్య, యూత్ అధ్యక్షుడిగా కూరతోట నాగరాజు, బీసీ సంఘం అధ్యక్షుడిగా కూరతోట రాజు, మహిళా సంఘం అధ్యక్షురాలిగా కూరతోట మంజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రేటర్ పరిధిలోని బొల్లికుంట గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు ఎన్నికల ఇన్చార్జి, ఏఎంసీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి తెలిపారు. అధ్యక్షుడిగా బొజ్జం సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా కందిక సమ్మయ్య, ఉపాధ్యక్షులుగా ఎర్ర రాజన్బాబు, తుమ్మ సాగర్రెడ్డి, బొజ్జం భరత్, పసునూరి రవీందర్, సంయుక్త కార్యదర్శులుగా గౌళికారి గోపి, సూర కుమార్, బన్న రవికుమార్, కోశాధికారిగా ఆగపాటి సమ్మక్క, గౌరవ కార్యవర్గ సభ్యులుగా ఆకారపు సమ్మయ్య, కీర్తి కుమార్, పెద్దపల్లి సత్యం, కందుల పెద్దరాజు, దేవర నరసింహ, ముస్కుల నరసింహారెడ్డి, ఎండీ యాకూబ్ ఎన్నికయ్యారు.
చెన్నారావుపేట: అమీనాబాద్, పత్తినాయక్తండా, ఎల్లాయగూడెం, బాపునగర్, అక్కల్చెడ, సూర్యాపేటతండా, కోనాపురంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, ఎంపీపీ విజేందర్, జడ్పీటీసీ పత్తినాయక్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తిరుపతి, సొసైటీ చైర్మన్ రవి, క్లస్టర్ ఇన్చార్జిలు మల్లయ్య, వీరారెడ్డి, బద్దూనాయక్, కృష్ణచైతన్యరెడ్డి, టీ శ్రీనివాస్, టీ చెన్నారెడ్డి, కే విజయ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ప్రకటించారు. అమీనాబాద్ అధ్యక్షుడిగా నార్లాపురం ఐలయ్య, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా రామ్మోహన్, రైతు విభాగం అధ్యక్షుడిగా కడారి బీరయ్య, మహిళా అధ్యక్షురాలిగా కాట్ల సులోచన ఎన్నికయ్యారు. అక్కల్చెడ అధ్యక్షుడిగా దోని రామచంద్రు, యూత్ అధ్యక్షుడిగా బదావత్ రవి, కోనాపురం అధ్యక్షుడిగా దొంగల రాజ్కుమార్, బాపునగర్ అధ్యక్షుడిగా డప్పు వీరన్న, రైతు విభాగం అధ్యక్షుడిగా బదావత్ లింగం, సూర్యాపేటతండా అధ్యక్షుడిగా ధరావత్ రెడ్యానాయక్, యూత్ అధ్యక్షుడిగా ధరావత్ జవహర్లాల్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా ధరావత్ సుగుణ ఎన్నికయ్యారు. ఎల్లాయగూడెం అధ్యక్షుడిగా ఎదురబోయిన సాంబయ్య, రైతు అనుబంధ కమిటీ అధ్యక్షుడిగా జినుకుల భిక్షపతి, మహిళా అనుబంధ గ్రామ కమిటీ అధ్యక్షురాలిగా బాషబోయిన స్వరూప, యూత్ అధ్యక్షుడిగా సింగారపు ప్రమోద్ను ఎన్నుకున్నారు.
నెక్కొండ: ఎన్నికల ఇన్చార్జిలు వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కర్పూరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అలంకానిపేట కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా చీకటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా జల్లె భద్రయ్య, కార్యదర్శిగా గుంటుక వెంకన్న, సంయుక్త కార్యదర్శిగా అంబాల సురేశ్, కోశాధికారిగా రాంపెల్లి చిన్న రవి, కార్యవర్గ సభ్యులుగా నార్లపురం మహేందర్, కర్పూరపు రామనాథన్, రాగిరి శ్రీనివాస్, హుస్సేన్, తిరుమల్ ఎన్నికయ్యారు. యూత్ అధ్యక్షుడిగా గార్లపాటి నిరంజన్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా గాజుల నరేశ్, ప్రధాన కార్యదర్శిగా లక్కాకుల శశికుమార్, భూపతి వీరేశ్, సంయుక్త కార్యదర్శిగా మర్రి రాజు, పొరండ్ల ప్రశాంత్, కోశాధికారిగా మేకల ప్రవీణ్ ఎన్నికయ్యారు. నక్కలగుట్టతండా, కస్నాతండాలో సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్ది ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఖానాపురం: కొడ్తిమాట్తండా అధ్యక్షుడిగా లకావత్ ప్రవీణ్నాయక్, నాజీతండా అధ్యక్షుడిగా బానోత్ కీరు, బోటిమీదితండా అధ్యక్షుడిగా గుగులోత్ కిషన్, రంగాపురం అధ్యక్షుడిగా బందారపు శ్రీనివాస్, వేపచెట్టుతండా అధ్యక్షుడిగా ధరావత్ బుచ్య, మంగళవారిపేట అధ్యక్షుడిగా పైండ్ల యాదగిరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, వేల్పుల లింగయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే మస్తాన్, బాలునాయక్ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: ముగ్ధుంపురంలో ఎన్నికల ఇన్చార్జిలు గూళ్ల అశోక్కుమార్, గంధం జగన్మోహన్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా చాపర్తి భిక్షపతి, సెక్రటరీగా కొనకటి రవి, రైతు విభాగం అధ్యక్షుడిగా అర్శనపెల్లి వెంకటేశ్వరరావు, బీసీసెల్ అధ్యక్షుడిగా ఆరెల్లి ప్రభాకర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బోళ్ల పద్మ, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా కుమారస్వామి, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా ఆంగోత్ మురళి, యూత్ విభాగం అధ్యక్షుడిగా వేల్పుల మధుకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ జ్యోతి, ఉప సర్పంచ్ తిరుపతినాయక్, నాయకులు రాజాగౌడ్, రాజన్న, మల్లేశం, బాలు పాల్గొన్నారు.
నల్లబెల్లి: టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్గౌడ్ సమక్షంలో ముచ్చింపుల గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కక్కెర్ల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా ధర్మారం సాంబయ్య, ఉపాధ్యక్షుడిగా బత్తిని సారయ్య, సభ్యులుగా ఊటుకూరి చిరంజీవి, పులి చంద్రయ్య, గొడిశాల రవి ఎన్నికయ్యారు.