పోచమ్మమైదాన్/కరీమాబాద్, సెప్టెంబర్ 16: దేశాయిపేటరోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వర్తక సంఘం శాశ్వత అధ్యక్షుడు ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సర్వర్ అహ్మద్పాషా వినాయక విగ్రహం అందించడంతోపాటు గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్తక సంఘం అధ్యక్షుడు ఆడెపు రవీందర్, విజయభాస్కర్రెడ్డి, మాధవ్కుమార్, నాగరాజు, పూర్ణచందర్, ప్రశాంత్, శంకర్, రామకృష్ణ, రాజు, నిజాం, అనిల్, వినోద్, పరమేశ్, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. 23వ డివిజన్ కొత్తవాడలో హనుమాన్ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అన్నదానం చేశారు. మాజీ కార్పొరేటర్ యెలుగు లీలావతి సత్యనారాయణ, తాడూరి చిట్టి, పిడుగు మహేశ్, సాయి, విన్ను, సురేశ్, రాజు, శివ, మహేందర్ పాల్గొన్నారు. కరీమాబాద్లోని ప్రధాన రహదారిలో సాయిగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని వరంగల్ ఏసీపీ గిరి ప్రారంభించారు. నారాయణ, రాజేశం, సాంబయ్య, రాంప్రసాద్, సమ్మయ్య, పున్నంచందర్, అక్తర్, భాస్కర్, పవన్, గిరిబాబు పాల్గొన్నారు.
విద్యానగర్కాలనీలోని విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుడికందుల నాగేశ్వర్రావు-భాగ్య ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సామాజికవేత్త అచ్చ వినోద్కుమార్ ప్రారంభించారు. ఉర్సులో బాలగణపతి అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేయ గా కార్పొరేటర్ మరుపల్ల రవి ప్రారంభించారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం శివనగర్లోని బాలగణేశ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యువనేతాజీ ఫౌండేషన్ సభ్యులు, బాల గణేశ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.