హన్మకొండ, సెప్టెంబర్ 15 : ఓరుగల్లుకు స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం సాయంత్రం జేఎన్ఎస్లో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నేషనల్ అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు నగరం చరిత్రలో ఇది మరచిపోని రోజన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి ఇలా అట్టహాసంగా పోటీలు జరుగడం సంతోషంగా ఉందన్నారు. గత పాలకుల పట్టింపులేమితో ఎంతోమంది క్రీడాకారులు వెలుగు లోకి రాలేకపోయారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి మెడికల్, ఎడ్యుకేషన్, ఐటీ హబ్గా తీర్చిదిద్దారని, త్వరలో స్పోర్ట్స్కు హబ్గా మార్చనున్నట్లు పేర్కొన్నారు. జేఎన్ఎస్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేశారన్నారు. ప్రతి జిల్లాలో ఒక స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వచ్చే సంవత్సరం కూడా మరో ఈవెంట్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత పోటీలకు గాను రూ.10లక్షలు జమ చేసినట్లు చెప్పారు. ఏడాది కా లంలోనే ట్రాక్ను పోటీలకు సిద్ధం చేశామని, ఇందు కు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
సంతోషంగా ఉంది
నగరంలో జాతీయ స్థాయి పోటీలు జరుగడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ట్రాక్ కోసం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సీఎం కేసీఆర్ను ఒప్పించారన్నారు. అలాగే వరంగల్లో క్రీడల నిర్వహణ, మైదానాల విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు స్పోర్ట్స్ పాలసీ అమలు చేస్తున్నారన్నారు. రూ.7.5కోట్లతో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి నెల ఒక ఈవెంట్ జరిగేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీ తరుణ్జోషి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అర్జున అవార్డు గ్రహీత, పద్మశ్రీ అంజుబాబీ జార్జ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్,కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ అథ్లెటిక్స్ జిల్లా అధ్యక్షుడు వరద రాజేశ్వర్రావు, వెంకటేశ్వర్రెడ్డి, సారంగపాణి, స్లానిజానీ పాల్గొన్నారు.
చరిత్రలో నిలిచిపోతుంది
సుబేదారి : వరంగల్లో తొలిసారిగా సింథటిక్ ట్రాక్పై జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం చారిత్రక ఘట్టంగా నిలుస్తుంది. ఇంతకు ముందు దేశంలో ఎక్కడైనా రాష్ట్ర రాజధానిలోనే సింథటిక్ ట్రాక్పై పోటీలు నిర్వహించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో మొదటిసారి కనీవినీ ఎరుగని రీతిలో సింథటిక్ ట్రాక్పై పోటీలు నిర్వహణ చాలా ఆనందంగా ఉంది. ఈ పోటీలతో వరంగల్కు ప్రపంచ స్థాయిలో మరింత ఖ్యాతి వస్తుంది. పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన క్రీడాకారులు వరంగల్ గొప్పదనం గురించి తెలుసుకునే అవకాశం ఈ ఈవెంట్తో వచ్చింది.
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
సుబేదారి : వరంగల్లో తొలిసారి సింథటిక్ ట్రాక్పై జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల నిర్వహణ ఇక్కడి ప్రజల అదృష్టం. ముఖ్యంగా యూత్కు ఈ పోటీలు ఇన్స్పైర్ ఉంటాయి. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్న ఈ పోటీల కోసం ఏర్పాట్లు బాగా చేశారు. ఇంతకుముందు ఇక్కడ సింథటిక్ ట్రాక్పై కాకుండా నార్మల్గా జాతీయస్థాయి పోటీలను విజయవంతం చేశారు. మొదటిసారిగా సింథటిక్ ట్రాక్పై జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అవకాశం వచ్చింది. క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారయంత్రాంగం బాగా సఫోర్ట్ చేస్తున్నది.
పాపం సోనిక..!
కొవిడ్ రిపోర్ట్ లేక నిరాకరణ అథ్లెటిక్స్పై ఎన్నో ఆశలతో హర్యానా నుంచి వరంగల్ చేరుకున్న సోనికకు నిరాశే ఎదురైంది. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురాకపోవడంతో ఆమెను స్టేడియంలోకి అనుమతించలేదు. దీంతో బుధవారం ఉదయం 5000 మీటర్ల పరుగుపందెం పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె మైదానంలో కంటతడి పెడుతూ అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఒలింపిక్సే లక్ష్యం..
మాది ఉత్తరప్రదేశ్ అమేటి గ్రామం. ముంబై రైల్వేస్లో ఉద్యోగం చేస్తున్నా. కడుపునొప్పితో బాధపడుతున్నా పోటీల్లో పాల్గొన్నా. ఒలింపిక్స్లో పాల్గొని భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటడమే నా కల. అందుకోసం చాలా కష్టపడుతున్నా. ప్రతిరోజూ మూడుగంటల పాటు శ్రమిస్తున్నా. 5వేల మీటర్ల పరుగుపందెంలో మొదటి విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబంలో బ్రదర్, సిస్టర్ ఇద్దరూ అథ్లెట్లే. 5వేల, 10వేల మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నారు. బాబాయ్ స్ఫూర్తితో నేను ఈ స్థాయికి వచ్చాను. 2013 అండర్-16లో గోల్డ్మెడల్ సాధించా. వరంగల్లో జరిగిన నేషనల్ మీట్ క్రాస్కంట్రీలో సిల్వర్ మెడల్ సాధించా.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
మాది ఉత్తరప్రదేశ్లోని మీరట్. మా తల్లిదండ్రులు, అన్నదమ్ములు చాలా ప్రోత్సహించారు. రైల్వేలో టెక్నికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నా. 2012లో నేషనల్ అథ్లెటిక్స్ పోటీల్లో మెడల్స్ సాధించాను. ఏషియన్ చాంపియన్లో పాల్గొ న్నా. సౌత్ఏషియన్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్స్ సాధించాను. ఏషియన్ గేమ్స్కు ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక్కడ 5వేల మీటర్ల పరుగుపందెంలో మొదటిస్థానంలో నిలువడం చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లలు టాలెంట్, ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించేందుకు తల్లిదండ్రులు సంపూర్ణంగా సహకరించాలి.