నర్సంపేట/కరీమాబాద్/చెన్నారావుపేట, సెప్టెంబర్ 15: జిల్లాలోని పలు వినాయక మండపాల వద్ద బుధవారం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సంపేట రెండో వార్డు పరిధిలోని కమలాపురంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మనోహర్, సంజీవగౌడ్, దండిగ రమేశ్, గడెపు రంజిత్, ముత్తినేని వీరన్న, యశ్వంత్, సారంగం, శివ, సదానందం పాల్గొన్నారు. మార్కండేయకాలనీలో వెల్దండి స్వరూప సహకారంతో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు.
గ్రేటర్ వరంగల్ 39వ డివిజన్ కరీమాబాద్లో శ్రీశ్రీ లక్ష్మీగణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మందల అర్జున్రెడ్డి, కుసుమ సతీశ్, మాచర్ల రవీందర్, బోరిగం నాగరాజు, యూత్ సభ్యులు వీరమల్ల రంజిత్, దిలీప్, దీపక్, రామగిరి రాజేశ్ పాల్గొన్నారు. చెన్నారావుపేటలో చైతన్య గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. టీఆర్ఎస్ నాయకుడు కంది కృష్ణచైతన్యరెడ్డి, ఎస్సై శీలం రవి, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, శిక్షణ ఎస్సై ప్రేమానంద్, వార్డు సభ్యులు రాసమల్ల సతీశ్, బండి ఉపేందర్, యూత్ సభ్యులు ఏ వీరేందర్, ముక్తీశ్వర్, విజేందర్, ప్రసాద్, రాజు పాల్గొన్నారు.