భీమదేవరపల్లి, సెప్టెంబర్ 14: ఆమె విధుల్లో భాగంగా అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపు దక్కింది. విశిష్టమైన ‘ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు’కు జనవరిలోనే ఎంపికైంది. కరోనా కారణంగా ప్రదానం వాయిదాపడగా, నేడు హైదరాబాద్లో స్వీకరించనుంది. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన శుక్రా, ములుకనూరు పీహెచ్సీ పరిధిలోని మల్లారంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నది. కుటుంబనియంత్రణ, రోగనిరోధక శక్తి పెంపు, అసంక్రమిత వ్యాధుల నివారణ కోసం క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించింది. మొదట్లో మారుమూల పల్లెవాసులు, గిరిజనులతో మమేకమై వారికి ఆరోగ్య సమ స్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక సంతానం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి చైతన్యవంతులను చేసింది.
హుస్నాబాద్ మండలం రామవరం సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా పనిచేసిన సమయంలో పోతారం, నందారం, ధర్మారం గ్రామాల్లో కుటుంబనియంత్రణ ఆపరేషన్లపై అవగా హన కల్పించేందుకు పాటుపడింది. తండావాసులను సమావేశ పరిచి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించింది. రవాణా వ్యవస్థ అంతంతే ఉన్న ఆ కాలంలో కాలినడకన వెళ్లి విధులు నిర్వర్తించేది. ఎల్కతుర్తి పీహెచ్సీలో ఏఎన్ఎంగా ఉన్న సమ యంలో కేశవాపూర్, రామకృష్ణాపూర్లో ఇంటింటికీ తిరుగు తూ కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరించింది. ఎల్కతుర్తి పీహెచ్సీలో నెలపాటు కరోనా పరీక్షలు చేసింది. ఈ క్రమంలో శుక్రా కూడా కరోనా బారిన పడి గుండెనిబ్బరంతో కోలుకుని వెంటనే విధుల్లో చేరింది.
నేడు అవార్డు స్వీకారం
దేశంలో విశిష్ట సేవలు అందించిన 56 మందిని కేంద్ర ప్రభు త్వం ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ఉన్నా రు. వీరిలో శుక్రా ఒకరు. ఏఎన్ఎంగా ఉత్తమ సేవలందించిన శుక్రా నేడు హైదరాబాద్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నది. రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆన్లైన్ లో ఆమెకు అవార్డు ప్రదానం చేయనున్నారు.