దుగ్గొండి, సెప్టెంబర్ 14: గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి పనులను నిత్యకృత్యంగా చేపట్టి వందశాతం పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ సూచించారు. చలపర్తి, రాజ్యాతండాలో మంగళవారం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణ పనులు, పల్లెప్రకృతి వనం, వర్మికాంపోస్టు తయారీని పరిశీలించారు. చలపర్తిలో ప్రధాన రహదారి వెంట మల్టీలేయర్ ప్లాంటేషన్ను పరిశీలించి ప్రజాప్రతినిధులను అభినందించారు రాజకీయాలకతీతంగా గ్రామస్తుల సహకారంతో వందశాతం పనులు పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి ఆధారంగానే గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్, సర్పంచ్లు ముదురుకోళ్ల శారదాకృష్ణ, రవీందర్నాయక్, కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్లాంటేషన్ పనులు ప్రారంభం
చెన్నారావుపేట: ఎమ్మెల్యే ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలో కిలో మీటర్ మేర 666 మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ను ఎంపీవో గౌడ సురేశ్, ఎంపీడీవో దయాకర్ ప్రారంభించారు. మండలంలోని 20 గ్రామాల్లో కిలో మీటర్కు 666 మొక్కల చొప్పున 25 కిలో మీటర్లలో మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి కార్యదర్శులు అటవీ శాఖ నర్సరీల నుంచి మొక్కలు తీసుకెళ్లి రహదారుల వెంట నాటుతారన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ సెక్షన్ అధికారి జయసుధ, మిషన్ భగీరథ ఏఈ మంగీలాల్, కార్యదర్శి బాలకిషన్గౌడ్, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.