నర్సంపేట, సెప్టెంబర్ 14: గర్భిణులు పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపల్ కౌన్సిలర్ రుద్ర మల్లీశ్వరి అన్నారు. పోషణమాసం సందర్భంగా పట్టణంలోని నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం పోషణ సంబురాలు నిర్వహించారు. పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుంటుందన్నారు. అంగన్వాడీల్లో గర్భిణులు, తల్లులు, పిల్లలకు పౌష్టిహారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నల్లా భారతి, హెచ్ఎం వర్థెల్లి సతీశ్కుమార్, అధ్యక్షురాలు వాసరం కరుణ, ఎలకంటి జయ, టీచర్ యాస్మిన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు నాయిని సునీత, గౌసియా, రజిత పాల్గొన్నారు.
పౌష్టికాహారం తీసుకోవాలి
చెన్నారావుపేట: గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారం తీసుకోవాలని జడ్పీ కో ఆప్షన్ ఎండీ రఫీ సూచించారు. మండలకేంద్రంలోని కట్టయ్యపల్లె అంగన్వాడీ కేంద్రంలో పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రఫీ చిన్నారులకు అన్నప్రాపన, అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అంగన్వాడీలు గర్భిణులకు సీమంతాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీవో రాధిక, ఏసీడీపీవో విద్య, సూపర్వైజర్లు రాధ, మంజుల, వార్డు సభ్యులు జే శ్రీధర్రెడ్డి, మాచర్ల అనూష, అంగన్వాడీ టీచర్లు మంజుల, దేవమ్మ, సునీత, లక్ష్మీబాయి, సరోజ, శౌరీలు, విజయ, కమల, సుజాత, శారతి, మాధవి, సుగుణ, జ్యోతి, ఆశ కార్యకర్తలు విజయ, మంజు పాల్గొన్నారు.