‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికో నర్సరీ ఏర్పాటుచేసింది. ఇందులో పూలు, పండ్ల మొక్కలతో పాటు పలుచోట్ల ఔషధ మొక్కలనూ విరివిగా పెంచుతోంది. ఔషధ గుణాలున్న మొక్కలతో ఇటు ఆరోగ్యంతో
ఆయా గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఈ నర్సరీల్లో సర్వరోగ నివారిణి అయిన అశ్వగంధతో పాటు రణపాల, నల్ల ఉమ్మెత్త, బ్రసిలియోన్సిస్, గుంట గరగర, తెల్లగుల్జేరు వంటి అనేక మొక్కలు న్నాయి
నల్లబెల్లి, సెప్టెంబర్ 25
అశ్వగంధ ఉపయోగాలు..
మొక్కను సర్వరోగ నివారిణి అంటారు. సొలనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క శాస్త్రీయ నామం విథానియాసోమిలి ఫేరా. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పెన్నే రు, బొమ్మడోలు అని పిలుస్తారు. దీనిని సంస్కృతంలో అశ్వగంధ అని పిలుస్తారు. తెలుగులో పెన్నేరు అని పిలుస్తారు. అశ్వగంధ మొక్క మానసిక ప్రశాంతతను చేకూర్చడంతో పాటు నిద్రలేమి తనాన్ని పోగొడు తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఎముకల నొప్పులు, చర్మవ్యాధులు, ఫంగస్, క్షయ, గజ్జి, తామర, కంటి సంబంధిత వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది.
సంజీవనితో సమానం.. రణపాల
ఈ మొక్క పలు రోగాల నివారణకు సంజీవనిలా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా, అతివిరేచనాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, చికున్గున్యా, టైఫాయిడ్, లో బీపీ, గుండె సంబంధ వ్యాధులు, అజీర్తి, మలబద్దకం, వేడి, కొవ్వుగడ్డలు కరగదీయడానికి, కామెర్లు, చెవిపోటు, షుగర్తో పాటు పలురకాల జబ్బులు రణపాల మొక్క ఆకులు వాడితే తగ్గుతాయి. వీటి ఆకులను పప్పులో వేసుకుని ఆ హారంగా తీసుకోవచ్చు.
నల్ల ఉమ్మెత్త ఔషధ విలువలు..
నల్ల ఉమ్మెత్త మొక్క స్వల నేషి కుటుంబానికి చెందింది. ఈ మొక్క ఆకులను మెత్తగా రుబ్బి పైపూతగా లేదా ఆకులను కాల్చి పొగను పీల్చడం వల్ల కుష్ఠువ్యాధి, దురద, ఉబ్బసం, గడ్డలు హరించుకుపోతాయి.
అన్నిటికీ మేలు..
నర్సరీల్లో ఔషధ మొక్కల పెంపకంతో జీపీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా మండలం లోని నర్సరీల్లో ఈ మొక్కలు పెంచుతున్నాం. నాడు పల్లె ప్రగతి పను లను అవహేళన చేసిన వారే నేడు దాని ఫలితా లను చూసి అభి నందిస్తున్నా రు. ప్రజలకు ఔషధ మొక్కలను అందు బాటులోకి తేవడం గర్వంగా ఉంది.
కూచన ప్రకాశ్, ఎంపీవో, నల్లబెల్లి