జనగామ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణికులతో హన్మకొండ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా మార్గమధ్యలో ఇంజిన్లో షార్ట్సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించి బస్సు మొత్తం పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులంతా బస్సు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పిందని ప్రయాణికులు అంటున్నారు. స్థానికులు పంచాయతీ ట్యాంకర్ సాయంతో మంటలు అదుపు చేశారు.