నర్మెట : రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి మంగళవారం పోలీసులు రిమాండ్ చేశారు. సివిల్ సప్లయ్ ఎన్పోర్స్మెంట్ ఓఎస్డీ(అడిషనల్ ఎస్పీ) ప్రభాకర్ నర్మెట పోలీస్స్టేషన్లో సీజ్ చేసి భద్రపరిచిన 250 క్వింటాళ్ల బియ్యంతో పాటు 450 గొనే సంచులను పరిశీలించారు. వీటిని జనగామలోని ఎంఎల్సీ గోదాంకు తరలించారు.
మండలంలోని ఆగాపేట గ్రామానికి చెందిన కల్యాణం చంద్రమౌళి, సిద్దిపేట జిల్లాకు చెందిన గుగులోత్ పాండుతో పాటు సిరిసిల్ల జిల్లా రగుడు గ్రామంలోని వెంకటేశ్వర రైస్మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరిని కల్యాణం చంద్రమౌళి, గుగులోత్ పాండును మంగళవారం రిమాండ్ చేసి కోర్టుకు తరలించారు.