పాలకుర్తి : మండలంలో శాతాపురం గ్రామ పరిధిలోని శ్రీబాల సరస్వతి విద్యానికేతన్కు చెందిన విద్యార్థులు బంగారు పథకాలు సాధించారు. ఇటీవల ఢీల్లీలోని అగ్రాలో ఇస్కు నార్త్ ఇండియన్ కరాటే ఛాంపియన్ షిఫ్ 2021 జాతీయస్థాయి కరాటే పోటీలు జరిగాయి. ఈ పోటీలో పలు రాష్ట్రాల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువారం కరాటే మాస్టర్ బాలు మాట్లాడుతూ భూక్యా శిరీష, భూక్యా హరికృష్ణ జాతీయస్థాయి పోటీలో పాల్గొని బంగారు పథకాలు సాధించారన్నారు.
పోటీలలో కటాస్ స్పేరింగ్ విభాగాలు నిర్వహించగా అందులో కటాస్ (యు17) విభాగంలో భూక్యా శిరీషకు మొదటి బహుమతి సాధించగా స్పేరింగ్ (యు18) విభాగంలో భూక్యా హరికృష్ణ మొదటి బహుమతి సాంధించారని టోర్నమెంట్ ఆర్గనైజర్ వినీత్కుమార్ అన్నారు. బంగారు పథకాలు సాధించిన కరాటే గ్రాండ్ మాస్టార్ ఎమ్ రవికుమార్, మాస్టర్ రమేశ్, రాజన్న, రమేశ్ను ప్రత్యేకంగా అభినందించారు.