కేసముద్రం, డిసెంబర్ 6 : కేసముద్రంలో అధునాతన సౌకర్యాలతో మోడల్ మార్కెట్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. నెల రోజుల వ్యవధిలో రూ.25 లక్షల మార్కెట్ ఫీజు వసూలు చేసిన సిబ్బందిని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ సన్మానించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మార్కెట్లో సుమారు రూ.9 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి గోదాములు, సరుకులు తడవకుండా కవర్ షెడ్లు, రైతులకు కనీస సౌకర్యాల కోసం తాగునీరు, మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని శంకర్నాయక్ సూచించారు. యాసంగిలో వరికి బదులు వాణిజ్య పంటలను సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందకు సీఎం కేసీఆర్ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నాని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మన ఊరు.. మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మండలంలోని పాతతండా, రాంలాల్ తండ, క్యాంపు తండా గ్రామ పంచాయితీల్లో ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 365 రోజుల నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్ ,మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, వైస్ ఎంపీపీ రావుల నవీన్రెడ్డి, సర్పంచ్ భట్టు శ్రీను, టీఆర్ఎస్ నాయకులు ఊకంటి యాకూబ్రెడ్డి, కముటం శ్రీనివాస్ పాల్గొన్నారు.