జనగామ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధి జఫర్గడ్ మండలంలోని 9 గ్రామాలకు చెందిన రైతుల ప్రైవేటు భూములు ప్రభుత్వ పరిధిలోకి వెళ్లాయి. ఈ విషయంలో రైతులు తమకు న్యాయం చేయాలని మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కడియం శ్రీహరి రైతులతో కలిసి కలెక్టర్ శివలింగయ్యకు వినతి పత్రం అందించారు.
రైతుల పట్టాల భూములు పీవోబీల కి ఎలా వెళ్లాయనే విషయంపై ఆలోచన చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ హామీనిచ్చారు.