ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలి
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి
‘భారత్ బంద్’ సందర్భంగా నాయకుల డిమాండ్
కేంద్ర సర్కారు తీరును ఎండగడుతూ నిరసనలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు
ఏడాది కాలంలోనే లాభాల బాటలో బ్యాంకు
రూ.1200 కోట్ల టర్నోవర్, రూ. 8కోట్ల లాభాలు
డీసీసీబీ మహాజనసభలో చైర్మన్ మార్నేని రవీందర్రావు
సుబేదారి, మార్చి 26 : ‘జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆర్థిక పురోగతిలో ఉంది.. మా పాలకవర్గం బాధ్యతలు తీసుకున్నాక ఏడాది కాలంలోనే రూ.870 కోట్ల నుంచి రూ.1144 కోట్ల వరకు టర్నోవర్కు తీసుకొచ్చాం.. ప్రస్తుతం రూ.8 కోట్ల లాభాలతో బ్యాంకు నడుస్తున్నది’ అని చైర్మన్ మార్నేని రవీందర్రావు అన్నారు. శుక్రవారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో చైర్మన్ అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సర్వసభ్య సమావేశం (మహాజనసభ) నిర్వహించారు. బ్యాంకు లావాదేవీలు, మార్ట్గేజ్, ఎల్టీఈ, గోల్డ్ లోన్లు, మహిళా సంఘాలు, చిరు వ్యాపారులకు రుణాలు, రికవరీ, బ్యాంకు సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులకు వివరించారు. అంతకుముందు ఏజీఎం స్రవంతి మహాజనసభ నివేదికను చదివి వినిపించారు. అనంతరం చైర్మన్ రవీందర్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి నూతన ఒరవడిని తీసుకొచ్చారని అన్నారు. రైతులకు 24 గంటల కరంట్, సాగునీరు, పంట పెట్టుబడి ఇలా అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి సాగును పండుగ చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని వరంగల్ డీసీసీబీ కొత్త పంథాలో నడిపిస్తున్నట్లు చెప్పారు. రైతులకు పంట రుణాలు ఇస్తూనే, కమర్షియల్ బ్యాంకులకు దీటుగా అతి తక్కువ వడ్డీతో మహిళా సంఘాలు, చిరువ్యాపారులకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణాలు ఇస్తున్నామన్నారు. రైతు కుటుంబాల్లో ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకు సైతం రూ.20 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కరీంనగర్ డీసీసీబీ ఆర్థికంగా బలోపేతమై ముందు వరుసలో ఉందని, ఆ జిల్లా బ్యాంకును ఆదర్శంగా తీసుకొని అన్ని వర్గాల ప్రజలకు అతి తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తూ బ్యాంకును బలోపేతం చేస్తున్నామని వివరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తేనే డీసీసీబీ ఆర్థికంగా ఎదుగుతుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీబీకి 19 బ్రాంచ్లు, 70 సహకార సంఘాలు ఉన్నాయని, చైర్మన్లు, పాలకవర్గం బిజినెస్పై దృష్టి పెట్టాలని సూచించారు. లాభాల్లో ఉన్న 44 సంఘాలకు వివిధ రకాల వ్యాపారం చేసుకోవడానికి నా బార్డు నుం చి ప్రతి సంఘానికి రూ.2 కోట్ల రుణాలు ఇస్తున్నామని అ న్నారు.
నిరుద్యోగులకు డెయి రీ, ఫిష్, కోళ్ల పరిశ్రమల స్థాపనకు రుణాలివ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. డీసీసీబీ రూ.1200 కోట్ల టర్నోవర్తో, రూ.8 కోట్ల లాభాలతో నడుస్తున్నదని అన్నారు. కొంతకాలంగా కోట్లాది రూపాయల రుణాలు రికవరీ కాకుండా పెండింగ్లో ఉన్నాయని, మా పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కో సమస్యను అధిగమిస్తూ రూ. 1200 కోట్ల టర్నోవర్కు తీసుకొచ్చామన్నారు. ఎన్పీఏ 7.5 నుంచి ప్రస్తుతం 3.4 వరకు తీసుకొచ్చి, మొండిబకాయిలను వసూలు చేశామని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు, పీఏసీఎస్ చైర్మన్లు, పాలకమండలి అంకితభావంతో పని చేయడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై తీర్మానం
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 సంవత్సరాల వయోపరిమితి పెంచిన విషయం తెలిసిందే. డీసీసీబీ ఉద్యోగులకు కూడా వయోపరిమితి పెంపు వర్తింపచేయాలని చైర్మన్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంకు సీఈవో చిన్నరావు, పాలకమండలి వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, డైరెక్టర్లు అన్నమనేని జగన్మోహన్రావు, కంది శ్రీనివాస్రెడ్డి, దొంగల రమేశ్, హరిప్రసాద్, చెట్టుపల్లి మురళీధర్, మాడుగుల రమేశ్, నరేందర్, ఎర్రబెల్లి గోపాల్రావు, శ్రీనివాస్, నర్సింగరావు, బ్యాంకు డీజీఎం అశోక్, ఏజీఎం స్రవంతి, మధు, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్, మార్క్ఫెడ్, ఆరు జిల్లాల సహకార శాఖ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.