నర్సంపేట, మే 21 : కరోనా కట్టడిలో భాగంగా శుక్రవారం నర్సంపేటలోని ప్రభుత్వ దవాఖాన, కార్యాలయాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సంబంధిత అధికారులు పిచికారీ చేయించారు. దవాఖానకు వస్తు న్న రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. మరోవైపు కరోనా పరీక్షలకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో దవాఖాన ఆవరణతోపాటు ఐసొలేషన్ వార్డును శానిటేష న్ చేయించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. పరిసరాల్లో పరిశుభ్రతకు ము న్సిపల్ సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
నర్సంపేట రూరల్లో..
నర్సంపేట రూరల్ : కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీజీఆర్పల్లి సర్పంచ్ తుత్తూరు కోమల అన్నారు. శుక్రవారం మండలంలోని జీజీఆర్పల్లి లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని జీపీ సిబ్బందితో ఆమె పిచికారీ చేయించారు. వీధులు, కరోనా బాధితుల ఇళ్లల్లో రసాయనాలను స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వైరస్ నియంత్రణకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. చంద్రయ్యపల్లి, భాంజీపేట, భోజ్యనాయక్తండా, దాసరిపల్లి, కమ్మపల్లి గ్రామాల్లోనూ హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్లు, కార్యదర్శులు, కారోబార్లు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : మండల కేంద్రంలోని వీధుల్లో పారిశుధ్య సిబ్బందితో స్థానిక సర్పంచ్ కుండె మల్లయ్య కార్యదర్శి బాలకిషన్గౌడ్ బ్లీచింగ్పౌడర్ను చల్లించారు. పోలీస్స్టేషన్, పీహెచ్సీ, ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాలు, కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రం వద్ద రసాయనాలను పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క రోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. లాక్డౌన్ దృష్ట్యా ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలన్నారు.
గీసుకొండలో..
గీసుగొండ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో గ్రా మాల్లో హైపోక్లోరైట్ ద్రావణంతో పాటు బ్లీచింగ్ పౌడర్ను చల్లిస్తున్నారు. శుక్రవారం మండలంలోని విశ్వనాథపురం, మరియపురం గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు రసాయనాలను పిచికారీ చేయించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. మాస్కులు ధ రించడంతోపాటు భౌతికదూరం పాటించాలని కోరారు.