హన్మకొండ, మే 17: ప్రైవేట్ డయాగ్నస్టిక్ నేటి నుంచి సిటీ స్కానింగ్ ధరల తగ్గింపు అమలు కావాలిసెంటర్లు, దవాఖానల్లో సిటీ స్కానింగ్కు సం బంధించి తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమలు కావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీహన్మంతు అన్నారు. ఫిల్మ్తో రూ. 2500, ఫిల్మ్ లేకుండా రూ.2000 చెల్లిం చాలని ఆయన సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశపు హాలులో దవాఖానల్లో బెడ్స్, ఆక్సిజన్ సరఫరాపై ఆయన ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు, వైద్యశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ ప్రతిరోజూ ఎంత మందిని అడ్మిట్ చేసుకుంటున్నారు, ఇంకా ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి అనే సమాచారం ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు ఇవ్వాలన్నారు. మీ దవాఖానలో బెడ్స్ ఖాళీగా లేకుంటే మీకు తెలిసిన దవాఖానలో ఖాళీగా ఉన్న సమాచారం పేషెంట్ కుటుంబానికి తెలియజేసి సహకరించాలని ఆయన కోరారు. ఆక్సిజన్ సరఫరాలో తేడాలు వస్తే కఠిన చర్యలు తప్పవని ఏజెన్సీకి హెచ్చరించారు.
ఆక్సిజన్ సరఫరా, అందుబాటులో ఉన్న సిలిండర్ల వివరాలను ప్రతిరోజూ ఇవ్వాల్సిందేనని డీపీవోను కలెక్టర్ ఆదేశించారు. ఏ ఒక్క దవాఖానలోనూ ఆక్సిజన్ కొరత రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఏజెన్సీ వారిని ఆయన కోరారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కావాల్సినంత స్టాక్ ఉందన్నారు. ఏదైనా దవాఖానలో ఇంజక్షన్లు అయిపోతే స్టాక్ ఉన్న దవాఖాన వారు అవసరమైన హాస్పిటల్కు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ లలితాదేవి, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, డీఆర్వో వాసుచంద్ర, డీపీవో జగదీశ్వర్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రఫీక్, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మధన్మోహన్రెడ్డి, తానా అధ్యక్షు డు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాకేష్రెడ్డి, డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ రమేశ్, రోహిణి హాస్పిటల్కు చెందిన డాక్టర్ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.