ఖిలావరంగల్, ఏప్రిల్ 15 : గ్రేటర్ విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధి 17వ డివిజన్లో రూ.3.70కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆదర్శనగర్లో రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనం, రూ.10 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ భవనం పనులు ప్రారంభించారు. అలాగే వసంతపురంలో రూ.10లక్షలతో మహిళా కమ్యూనిటీ భవనం, రూ.10లక్షలతో మురికి కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దూపకుంటలో రూ.2.50కోట్లు, బొల్లికుంటలో రూ.50లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జన్నుపాల రాంబాబు, గద్దె బాబు, పోచన స్వామి, తగరల ప్రసాద్, సోల్తీ నరేందర్, పసునూరి వజ్రయ్య పాల్గొన్నారు.
రైతు మహాగర్జన పోస్టర్ ఆవిష్కరణ
పరకాల : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న కరీంనగర్లో నిర్వహించే రైతు మహాగర్జన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓసీ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్రెడ్డి, కామిడి సతీశ్రెడ్డి, రావుల నర్సింహారెడ్డి, దుబ్బా శ్రీనివాస్, పవన్కుమార్, బోయినపల్లి పాపారావు, నల్లా రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
అమెరికా పార్లమెంట్లో అంబేడ్కర్కు నివాళులు
IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్