ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పరకాల, జూన్ 13: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ, పరకాల, నడికూడ మండలాలకు చెందిన 42 మందికి రూ.17.66లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సైతం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఆసరాగా నిలుస్తోందన్నారు. సీఎం నిరంతర కృషితోనే ఆపత్కాలంలోనూ పథకాలు కొనసాగుతున్నాయని, ఇది కేసీఆర్కు మాత్రమే సాధ్యమని అన్నారు.
రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, పరకాల, నడికూడ మండలాల ఎంపీపీలు తక్కళ్లపల్లి స్వర్ణలత, మచ్చ అనసూర్య, సిలివేరు మొగిళి, కోడెపాక సుమలత, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ నందికొండ జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు బండి సారంగపాణి, ఆముదాలపల్లి ఆశోక్, భీముడి నాగిరెడ్డి, నాయకులు పసుల రమేశ్, నల్లెల్ల అనిల్ పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం
దామెర: కరోనాతో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్నారు. దామెర మండలంలోని ల్యాదెళ్లలో కరోనాతో మృతి చెందిన రైతుబంధు సమితి గ్రామకన్వీనర్ అమ్ము ల రాజుయాదవ్, మాదాసు యాదమ్మ, దుర్గంపేటలో రైతుబంధు సమితి సభ్యులు ముత్యాల రమే శ్, పుచ్చకాయల తిరుపతిరెడ్డి, ఊరుగొండలో గోగుల వీరమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం, ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కమలాకర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, సర్పంచ్లు కుక్క శ్రావణ్య, గోగుల సత్యనారాయణరెడ్డి, యాదా రాజేశ్వరి, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృపాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేశ్, పార్టీ జిల్లా నాయకుడు సిలివేరు నర్సయ్య పాల్గొన్నారు.