విత్తన షాపు ప్రారంభోత్సవంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
నర్సంపేట, జూన్13: ప్రతి రైతూ అభివృద్ధి చెందాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డులో విఘ్నేశ్వర ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులు సొంతంగా ఏర్పాటు చేసిన ఎరువులు, పురుగు మందుల షాపును ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాష్ట్రంలోని రైతులు అభివృద్ధిలో ముందు వరుసలో ఉన్నారన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందు లు వాడి పంటల దిగుబడి పెంచుకోవాలన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా కేసీఆర్ రైతులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోనే ఫార్మర్ సొసైటీల ఏర్పా టు నర్సంపేట నియోజకవర్గంలో అధికంగా ఏర్పడ్డాయన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు ఆదర్శవంతంగా ఉండాలని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వార్డు సభ్యులు రాయిడి కీర్తి, విఘ్నేశ్వర ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు చిలువేరు కుమారస్వామి, రాయిడి రవీందర్రెడ్డి, తూముగంటి చక్రపాణి, ఏవో కృష్ణకుమార్, ఏఈవో మెండు అశోక్, నామాల సత్యనారాయణ, మోతె జైపాల్రెడ్డి, చిలుకూరి వెంకటేశ్వర్లు, చిలువేరు కొమ్మాలు, చిలువేరు కొమురయ్య, శివకుమార్, కార్తీక్కుమార్, బుర్ర మోహన్రెడ్డి, రాధారపు రాజయ్య, లింగాల సూరయ్య, కడారి కుమారస్వామి, గంగాడి రాజమల్లారెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి, ముత్యాల స్వామి, తౌటి వెంకటనారాయణ, అజ్మీరా మంగ్య, చింతల సాంబరెడ్డి, పుట్ట హనుమయ్య, ఈగ సత్యనారాయణ, లింగాల శంకర్, తోట అశోక్, మండల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు వ్యాపారుల వినతి
నెక్కొండ: కిరాణ, వర్తక వ్యాపారులు, వర్కర్లను హైరిస్క్ స్ప్రెడర్లుగా గుర్తించి ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని వ్యాపారులు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిని కోరారు. పీఏసీఎస్ చైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో సంఘం కార్యదర్శి దుబ్బ నాగరాజు నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. పెద్దిని కలిసిన వారిలో వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం తదితరులు ఉన్నారు.