జనగామ, మే 11 (నమస్తే తెలంగాణ) : కరోనా పాజిటివ్ వస్తే భయపడాల్సిన పనిలేదని, మనోధైర్యంతో మెడికల్ కిట్ వినియోగించుకుని వైద్యుల సూచనలు పాటిస్తే మహమ్మారి నుంచి బయటపడొచ్చని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వంద పడకల కరోనా ఐసొలేషన్ వార్డును మంగళవారం ఆయన సందర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ పూజారి రఘుతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వార్డులో వసతులు, ఆక్సిజన్ బెడ్లను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం హన్మకొండ రోడ్డులోని పాల కేంద్రం హిందూ శ్మశానవాటిక అభివృద్ధి పనులు పరిశీలించి రూ.కోటితో మోడల్ వైకుంఠధామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చౌరస్తాలో రోడ్డు విస్తరణ, వాటర్ ఫౌంటేన్ ఏర్పాటుకు స్థలం వంటి అంశాలపై డీసీపీ శ్రీనివాస్రెడ్డి, కాంట్రాక్టర్తో ఫోన్లో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్పై ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, వైరస్ సోకిన వారికి ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా పడకలు, ఆక్సిజన్ ఉందన్నారు.
24 గంటలు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది ఉన్నారని ఆయన చెప్పారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, వైరస్ కట్టడికి తీసుకుంటు న్న చర్యలు, వ్యాక్సినేషన్, పరీక్షలు వంటి అంశాలను అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ కొరత ఉందనే అపోహతో ప్రజలు అధైర్య పడొద్దని, హన్మకొండ రోడ్డులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 100 పడకల ఐసొలేషన్ వార్డు సిద్ధంగా ఉందని తెలిపారు. అవసరమైతే జిల్లాలోని మైనార్టీ గురుకులాలను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్వో, సూపరింటెండెంట్లు, వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తప్పని సరి గా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆ యన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యా దగిరిరెడ్డి, కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.