స్టేషన్ఘన్పూర్/దేవరుప్పుల, మే 11 : స్టేషన్ఘన్పూర్, దేవరుప్పుల మండలాల్లో మంగళవారం సా యంత్రం చిరుజల్లులు కురిశాయి. ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే కొంత మేరకు వరి కోతలు పూర్తవగా, మిగిలిన పంట చేతికొచ్చే దశలో వర్షం కురిసింది. భారీ వర్షం కాకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. స్టేషన్ఘన్పూర్, నమిలిగొండ, ఇప్పగూడెం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద పలువురు రైతులు ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పారు. కాంటా అయిన ధాన్యాన్ని మిల్లులకు వెంటనే తరలించాలని పలువురు రైతులు సంబంధిత అధికారులను కోరారు.
దేవరుప్పులలో పిడుగుపడి 10 గొర్రెలు మృతి
దేవరుప్పుల మండల కేంద్రంలోని గడ్డచెలుక ప్రాం తంలో మంగళవారం సాయంత్రం పిడుగుపడగా తోటకూర సోమయ్యకు చెందిన పది గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయి. వర్షం కురుస్తున్న నేపథ్యంలో చెట్టు కిందకు గొర్రెలు వెళ్లగా ఈ దుర్ఘటన జరిగింది. బాధితుడికి ప్రభుత్వం పరిహారం అందించాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశాడు.
విద్యుదాఘాతంతో మూడు మేకలు మృతి
కొడకండ్ల : విద్యుత్ వైర్లు తెగి మూడు మే కలు మృతి చెందిన ఘటన మండలంలోని ఏడు నూతుల గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దెబో యిన అంజయ్య తన మేకలను ఎప్పటిలాగే సాయంత్రం ఇంటికి తోలుకొస్తుండగా అంతకు ముందు వర్షం కురి సింది. దీంతో రహదారిపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. తీగలకు విద్యుత్ ప్రసరి స్తుండగా వాటిపై నుంచి మేకలు వెళ్లడంతో షాక్కు గురై మృతి చెం దాయి. ఈ ఘటనలో మూ డు మేకలు మృతి చెందాయని, దీంతో సుమారు రూ.30 వేలు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం పరిశీలించి ఆర్థిక సాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశాడు.