నర్సంపేట, మే 10 : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుం టి రజిని కోరారు. సోమవారం పట్టణం లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. కరోనా లక్షణా లు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని, వైద్యులను సంప్రదించాలన్నారు. నర్సంపేట ఏరియా దవాఖానలోనూ కరోనా వా ర్డు ఉందని, అవసరమైన పేషెంట్లకు ఆక్సిజన్ అందిస్తున్నారన్నారు. పరిశుభ్రత పాటించాలని, రోడ్లపై వ్యర్థాలు వేయొద్దన్నారు.
నర్సంపేట రూరల్ : ప్రజలు కరోనా వైరస్ ని ర్మూలనకు కృషి చేయాలని రామవరం, దాసరిప ల్లి, మహేశ్వరం, లక్నేపల్లి గ్రామాల సర్పంచ్లు కొ డారి రవన్న, పెండ్యాల శ్రీనివాస్, మాడ్గుల కవిత, గొడిశాల రాంబాబు కోరారు. సోమవారం మండలంలోని అన్ని గ్రామాల్లో జీసీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. గ్రామా ల్లో జరుగుతున్న పనులను సర్పంచ్లు పరిశీలించారు. మాస్కులు ధరించాలని సూచించారు.
చెన్నారావుపేట : మండలంలోని అమీనాబాద్, చెన్నారావుపేట, ఖాదర్పేట, కోనాపురం, అక్కల్చెడ, జల్లి, ఎల్లాయగూడెం, పాపయ్యపేట, తిమ్మరాయిని పహాడ్, బోజేర్వు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. అమృతండాలో సర్పంచ్ బోడ వెంకన్న సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి అనసూర్య పాల్గొన్నారు. ఎల్లాయగూడెం గ్రామంలో కరోనా సోకిన వ్యక్తుల వద్దకు వెళ్లి ఉప సర్పంచ్ విజయ్కుమార్ మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట ఏఎన్ఎం మంజుల, అంగన్వాడీ వలంటీర్ బాషబోయిన రమ, కల్యాణి, ఆర్ఎంపీ మంద రవికుమార్, కారోబార్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
నెక్కొండ : మండలంలోని పెద్దకోర్పోలులో సర్పంచ్ మహబూబ్పాషా ఆధ్వర్యంలో సోడి యం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.