చెరువులో విషం కలిపారంటున్న మత్స్యకారులు
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
ఎల్కతుర్తి, ఏప్రిల్ 8 : చెరువులో విష గుళికలు కలుపడంతో రూ. 4లక్షల చేపలు మృతి చెందాయి. ఈ ఘటన మండలంలోని ఇందిరానగర్ చెరువులోగురువారం తెల్లవారు జామున వెలుగుచూసింది. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం…ఎల్కతుర్తి గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు మండలంలోని ఇందిరానగర్ బామండ్లకుంటలో ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత చేప పిల్లలతో పాటు మరో 2 క్విం టాళ్ల చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో పోసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరగడంతో అమ్మేందుకు సిద్ధమయ్యారు. గురువారం తెల్లవారుజామున చెరువులోని చేపలు మృతి చెందాయనే విషయం తెలుసుకున్న మత్స్యకారులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. సుమారు రూ. 4 లక్షల విలువైన చేపలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గడ్డం ఉమా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆస్పత్రి నుంచి సచిన్ డిశ్చార్జ్..మరికొన్ని రోజులు హోంక్వారంటైన్లోనే!
నిమ్మరసం, పసుపు కలుపుకుని తాగితే కలిగే లాభాలివే..!