కాపలాకాస్తున్న సీసీ కెమెరాలు
నేరాల నియంత్రణకు పోలీసుల వ్యూహం
సంగెం, కుంటపల్లి గ్రామాల్లో 44 సీసీ కెమెరాల ఏర్పాటు
సంగెం, ఏప్రిల్7: దొంగతనాలు, హత్యలు, దారిదోపిడీలు, డాడులు వంటి నేరాల నియంత్రణకు పల్లెల్లో నిఘా నేత్రాలు 24 గంటలూ కాపలా కాస్తున్నాయి. మండలంలో 31 గ్రామ పంచాయతీలు ఉండగా సంగెం, కుంటపల్లి గ్రామాలు సీసీ కెమెరాల నీడలో ఉన్నాయి. నిత్యం మండల కేంద్రానికి వివిధ గ్రామాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. సంగెం మీదుగా వరంగల్-మహబూబాబాద్ ప్రధానరోడ్డు ఉండడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏ వాహనదారుడి తప్పిదంతో ప్రమాదం జరిగిందనే విషయం సీసీ పుటేజీల ద్వారా తెలుసుకునే వీలుంది. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
44 సీసీ కెమెరాల ఏర్పాటు
సంగెం మండల కేంద్రంతోపాటు పక్కనే ఉన్న కుంటపల్లిలో స్థానిక ప్రజాప్రతినిదులు, వ్యాపారులు, ప్రజల సహకారంతో పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రామాల్లో కలిపి 44 సీసీ కెమెరాలను ఇటీవల ఈస్ట్జోన్ డీసీడీ కే.వెంకటలక్ష్మి సంగెం పోలీసుస్టేషన్లో ప్రారంభించారు. వాటిని పోలీసుస్టేషన్కు అనుసంధానం చేశారు. మండల కేంద్రంలో 29 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రానికి నాలుగు వైపులా వచ్చే వాహనాలను ప్రతిక్షణం సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తాయి. కుంటపల్లి గ్రామంలో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సంగెం అంబేద్కర్ కూడలి, రైతువేదిక, ఇందిరాగాంధీ కూడలి, చెరువుకట్ట వద్ద ఉన్న పోచమ్మ దేవాలయం వద్ద కూడళ్లలో మూడు సీసీ కెమెరాల చొప్పున అమర్చారు.
రూ.2లక్షల విలువైన కేబుల్ను వితరణ
సంగెం, కుంటపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసుస్టేషన్కు అనుసంధానం చేసేందుకు మండల కేంద్రానికి చెందిన ఎస్వీసీ చానల్ ప్రొపరేటర్ బిట్ల వెంకటేశ్వర్లు రూ.2లక్షల విలువైన కేబుల్ను పోలీసులకు అందజేశారు. ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వెంకటేశ్వర్లను శాలువాతో సన్మానించారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ సీఆర్పీఎఫ్ను నేను గౌరవించను: మమతాబెనర్జి
పంజాబ్లో నైట్ కర్ఫ్యూ.. రాజకీయ సమావేశాలు బ్యాన్