మార్కెట్ చైర్మన్ చింతం సదానందం
కాశీబుగ్గ, జూన్6: నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ను ఆదివారం ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం సందర్శించి తనిఖీ చేశారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం చేస్తే టెండర్ను రద్దు చేస్తామని సంబంధిత కాంట్రాక్టర్ను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయడంతో దుర్వాసన వెదజల్లుతోందన్నారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని తనిఖీ చేసినట్లు తెలిపారు. గతంలో చాలా సార్లు కాంట్రాక్టర్ను హెచ్చరించినా పనితీరు మార్చుకోవడం లేదని అన్నారు. మార్కెట్ సూపర్వైజర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజు పారిశుధ్య పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.