ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు
వరంగల్ సబర్బన్, ఏప్రిల్6: ఈ ఎండాకాలంలో ఎన్పీడీసీఎల్ పరిధిలో ని జిల్లాల్లో నిరంతర విద్యుత్తు సరఫరా జరిగేలా చూడాలని చీఫ్ జనరల్ మేనే జర్లను, సూపరింటెండెంట్ ఇంజినీర్లకు సీఎండీ అన్నమనేని గోపాల్రావు సూ చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2021-22 సంవత్సరాల్లో పెరిగే విద్యుత్ విని యోగాన్ని దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా మౌలిక వసతులు ఏ ర్పాటు చేశామన్నారు. ఈ ఎండాకాలంలో జేఎల్ఎం నుంచి మొద లుకొని ఎస్ఈల వరకు పీక్లోడ్ సమయాల్లో తప్పకుండా ఉండడం అనివార్యమన్నారు. ఈ విషయాన్ని కార్పొరేట్ ఆఫీస్ ఆపరేషన్ వింగ్ నిత్యం లోడ్ డిస్పాచ్ నుంచి పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు. అ లాగే ఏప్రిల్, మే, జూన్ లో సంభవించే గాలుల వల్ల విద్యుత్ సంస్థకు నష్టం వాటిల్లుతుందని, అందుకోసం తగినన్ని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామగ్రితోపాటు కాంట్రాక్ట్ ఏజన్సీలను కూడా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వినియోగదారులకు సరఫరాలో ఎ లాంటి అంతరాయాలున్నా టోల్ ఫ్రీ నంబర్ 1921, 180042500 28, వెబ్సైట్ www.tsnpdcl.in, మొబైల్ యాప్, ట్విట్టర్ (TSN PDCLLO RGANIZA), ఫేస్బుక్(telangana state north ern power distribution company limited) ద్వారా తెలియ జేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎండీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాఫెల్ ఒప్పందంలో మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్