పొద్దున్నే ఖైదీలకు కషాయం
అందుబాటులో ఆక్సిజన్ జనరేటర్ పరికరం
అవసరం ఉన్నవారికి ఐసొలేషన్ సదుపాయం
టెస్టుల తర్వాతే ఖైదీలకు అడ్మిషన్
ములాఖత్లు బంద్
వీడియో కాల్కు అవకాశం
పోచమ్మమైదాన్, మే 5: అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న కరోనా సెకండ్ వేవ్పై వరంగల్ కేంద్ర కారాగారం అధికారులు అప్రమత్తమయ్యారు. ఖైదీలు కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కొందరు బ్యారక్లో ఉండడం, మరికొందరు ఆరుబయట పనులు చేస్తుండడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఖైదీలెవరికైనా పల్స్ రేట్ తగ్గిన సందర్భంలో ఇటీవల ఇచ్చేందుకు అధునాతన ఆక్సిజన్ జనరేటర్ను తీసుకొచ్చారు.
నిత్యం కషాయం పంపిణీ..
ప్రస్తుతం జైలులో 971 మంది ఖైదీలున్నారు. వీరికి రోజూ పొద్దున్నే కషాయం పంపిణీ చేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ సదుపాయం అందుబాటులో ఉంచారు. పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా వేడి నీటి కోసం గ్లీజర్లు ఏర్పా టు చేశారు. జైలు ఆవరణ, బ్యారక్లలో పరిశుభ్రత కోసం బ్లీచింగ్తో శానిటైజ్ చేస్తున్నారు. రోజూ హైపోక్లోరైట్ ద్రావ ణం పిచికారీ చేస్తున్నారు. ఎవరైనా ఖైదీ అనారోగ్యం బారిన పడి ఆక్సిజన్ అందక ఇబ్బందులు ఎదురవుతే తక్షణ సాయం కోసం ప్రత్యేకంగా ఆటోమెటిక్ ఆక్సిజన్ జనరేటర్ను అందుబాటులో ఉంచారు. దీనిద్వారా 24 గంటలు ఆక్సిజన్ అందించే సౌకర్యం ఉంటుంది.
ఐసొలేషన్ ఏర్పాట్లు ..
ఖైదీలెవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి ప్రత్యేకంగా మెడికల్ కిట్ అందజేయడంతో పాటు ఐసొలేషన్ సదుపాయం కల్పించారు. వీరికి ప్రత్యేక డైట్ కూడా అందించే ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైతే చికిత్స కోసం ఎంజీఎంకు తరలించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి జైలుకు వచ్చే ఖైదీలకు ముందుగా కరోనా టెస్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా నాలుగు మాస్క్లు, కొత్త వస్ర్తాలు అందిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆవరణ, ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఖైదీలకు ఫేస్షీల్డ్స్ కూడా పంపిణీ చేశారు.
నో ములాఖత్..
డీజీ ఆదేశాల మేరకు కేంద్ర కారాగారంలో ఖైదీలతో ములాఖత్లు బంద్ చేశారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్రభు త్వ వెబ్సైట్ యాప్ ద్వారా బుక్ చేసుకుని వీడియో కాల్ ద్వారా అవకాశం కల్పించారు. ఎవరూ ములాఖత్కు రావద్దని కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తున్నారు. వారంలో మూడు, నాలుగు సార్లు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారు.