మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజీనామా
35 ఏళ్లుగా పార్టీలో వివిధ పదవులు
జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో నిర్ణయం
నాలుగు డివిజన్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
హన్మకొండ చౌరస్తా, మే 3 : కాంగ్రెస్కు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో కొనసాగిన ఆమె పార్టీని వీడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. స్వర్ణ రాజీనామాతో కాంగ్రెస్లో కలకలం మొదలైంది. స్వర్ణ రాజీనామాకు పార్టీలో కొనసాగుతున్న వర్గపోరే ప్రధాన కారణమని పలువురు కాంగ్రెస్ నా యకులు గుసగుసలాడుతున్నారు. కొన్ని సం వత్సరాలుగా జిల్లా అధ్యక్షుడు నాయిని రా జేందర్రెడ్డి, ఆమెకు మధ్య జరుగుతున్న ఘ టనలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నా రు. రాష్ట్ర అధ్యక్షుడు సైతం ఆయనకే వత్తాసు పలుకడం, కొత్తగా వచ్చిన కొండా దంపతులకు ప్రాధాన్యమిస్తుండడంతో పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. 1985లో కాంగ్రెస్లో కి వచ్చిన స్వర్ణ సుమారు 35 సంవత్సరాలు అనేక పదవుల్లో కొనసాగారు. కాంగ్రెస్ నుం చి గెలిచి వరంగల్ మేయర్గా పనిచేశారు. వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కొనసాగారు. కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్లో వస్తున్న విభేదాలు, నాయకత్వం పట్టిం చుకోకపోవడంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట మి చెందడం ఎంతగానో కలిచి వేసిందని, టీ పీసీసీ మెంబర్, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్వర్ణ ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దవాఖా న నుంచి డిశ్చార్జి అయిన తర్వాత రాజీనా మా సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
నాలుగుతో సరి..
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు డివిజన్లతో సరిపెట్టుకుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాలుగు డివిజన్లు గెలుపొందింది. తూర్పులో ఒక్క డివిజన్లో కూడా గెలుపొందలేదు.