మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, ఏప్రిల్ 2 : అవయవ దానంతో అమరత్వం సిద్ధిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి నివాసంలో అవయవదాన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ అధ్యక్షతన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అవయవ దానం ప్రాణదానంతో సమానమని, ప్రమాదాలు, ఇతర కారణాలతో బాధపడేవారిని బతికించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు బృందాకర్, నూకల రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
రోజూ పరగడుపునే కొబ్బరి నీళ్లను తాగితే..?