తడిసిముద్దయిన ధాన్యం
జనగామ జిల్లా నర్మెట మండలంలోని వెల్దండ, కన్నెబోయినగూడెం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిముద్దయింది. వరదనీటిలో కొట్టుకుపోతున్న వడ్లను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలుపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని త్వరగా కాంటాలు వేయాలని
నిర్వాహకులను కోరారు.
నర్మెట, మే 18