యునెస్కో గుర్తింపు రావడానికి సీఎం కేసీఆర్ కృషి
మాజీ ఎంపీ సీతారాంనాయక్
మహబూబాబాద్, జూలై 30 : రామప్ప శిల్పకళా సౌందర్యానికి చిరునామా అని మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యునెస్కో గుర్తింపు కోసం 2015 నుంచి సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో పలు మార్లు కేంద్ర పర్యాటక రంగం ద్వారా ఎంపీలందరూ వినతి పత్రాలు అంద జేశారని మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ర్టానికి చెందిన లోక్సభ ఎంపీలు రామప్ప శిల్పకళ సంపద గురించి యునెస్కోకు ప్రతిపాదనలు పంపామన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపుపై డబ్బా కొడుతున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి 2015లో ఎక్కడున్నారో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవతో యునెస్కోకు ప్రతిపాదనలు పంపించడం మూలంగానే క్షేత్ర స్థాయిలో పరిశీలించి రామప్పను శిల్పకళా వారసత్వ సంపద కింద గుర్తించారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేవాలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి చేసిన కృషితో ఎంపీలు డోసియర్ పంపితేనే యునెస్కో గుర్తించిందని పేర్కొన్నారు. రామప్పను యునెస్కో గుర్తింపునకు బీజేపీ నాయకులు కృషి చేశామనడం హాస్యస్పదంగా ఉందన్నారు. ప్రతిపాదనలు పంపినప్పుడు దేశంలోనే మొదటగా రామప్ప శిల్పకళలను యునెస్కో గుర్తించిందన్నారు. ఆ తరువాత రాజస్థాన్, ముంబైలను గుర్తించిందన్నారు. ప్రకటన వచ్చే వరకు ముంబైను ముందు వరుసలో ఉంచి, ఆ తరువాత రాజస్థాన్ను ప్రకటిస్తూ రామప్పపై కేంద్రం వివక్ష చూపింది నిజం కాదా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రామప్ప గొప్ప పేరుతో కొత్త పర్యాటక కేంద్రంగా మారాలని తాను ఎంపీగా ఉన్న సమయంలోనే రూ. 20 లక్షల ఎంపీ నిధులు, రూ.30 లక్షల సీఎస్ ల్యాడ్స్ కింద నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. ఉద్యానవన కేంద్రంగా రామప్ప చెరువును తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.