2న ‘మేడారం సమ్మక్క – సారలమ్మ నాటకం’
పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ
హన్మకొండ చౌరస్తా, జూలై 30 : నాటకరంగ ప్రపంచంలో సురభి నాటక సమాజం ఎంతో ఖ్యాతి గడించిందని, అలాంటి సురభి నాటక కళాకారులను ఆదరించి ప్రోత్సహించాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. శ్రీసాయి సంతోషి నాట్యమండలి, పోతన విజ్ఞాన పీఠం సంయుక్త ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో వచ్చే నెల 2న సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించనున్న ‘శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మ’ నాటక ప్రదర్శన పోస్టర్లను శుక్రవారం వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో పోతన పీఠం కార్యదర్శి నమిలిగొండ బాలకిషన్రావు, ఆర్యవైశ్య జాతీయ ఫెడరేషన్ నాయకుడు గట్టు మహేశ్బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనాతో ఇబ్బందులున్నా నాటకాన్ని ప్రదర్శిస్తున్న సురభి కళాకారులను అభినందించారు. 130 వసంతాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సురభి నాటక సమా జం మన సంపద అన్నారు. 40 రోజుల పాటు ప్రత్యేక వర్క్షాప్ ద్వారా ఎన్నో మెళకువలతో ప్రదర్శించనున్న నాటకాన్ని ఓరుగల్లు వాసులు తిలకించాలని కోరారు. నాట్యమండలి నిర్వాహకుడు సురభి సంతోష్ మాట్లాడుతూ.. ఈ నాటకంలో తమ కళాకారులతో పాటు వరంగల్ నగరానికి చెందిన 12 మంది విభిన్నపాత్రల్లో కనిపిస్తారని అన్నారు. సురభి సిందూరి కొండల్రావు స్వీయ రచన, దర్శకత్వంలో ‘మేడారం సమ్మక్క-సారలమ్మ’ ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. విక్రమ్, శ్రీనివాస్, టీ నరేందర్, ఆర్ చక్రపాణి, పోతన పీఠం మేనేజర్ జేఎన్ శర్మ, కళాకారులు పాల్గొన్నారు.