కుటుంబాలతో కలిసి జీవించండి
మావోయిస్టులకు డీఎస్పీ సంపత్రావు విజ్ఞప్తి
మత్స్య సోమన్న కుటుంబానికి సరుకుల అందజేత
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలువాలని భూపాలపల్లి డీఎస్పీ అవిరినేని సంపత్రావు విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లి మండల పరిధిలోని పంబాపూర్కు చెందిన మత్స్య సమ్మయ్య అలియాస్ సోమన్న కుటుంబ సభ్యులకు సీఐ వాసుదేవరావుతో కలిసి నిత్యావసర సరుకులు, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ సోకి అనేక మంది మావోయిస్టులు మృతి చెందుతున్నారని, లొంగిపోతే మెరుగైన వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. అజ్ఞాతంలో ఉండి సాధించేది ఏమీ లేదన్నారు. 35 ఏళ్లుగా సోమన్న భార్య, పిల్లలకు దూరంగా ఉండి ఏం సాధించారన్నారు. లొంగిపోయిన వారికి శాఖ పరంగా, ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని వసతులను కల్పించనున్నట్లు చెప్పారు. లొంగి పోయేలా వారిలో మార్పు తీసుకురావాలని సోమన్న భార్య సుగుణ, కుమారులు భాస్కర్, కృష్ణకు డీఎస్పీ, సీఐలు సూచించారు.