లాక్డౌన్ను మరింత పటిష్టంగాఅమలు చేయాలి : ఎస్పీ కోటిరెడ్డి
తొర్రూరులో కాలినడకన తిరిగిన ఎస్పీ
తొర్రూరు, మే 27 : తొర్రూరు డివిజన్ కేంద్రంలో కరోనా కట్టడి, లాక్డౌన్ అమలు తీరును గురువారం మ హబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. డీఎస్పీ ఎం.వెంకటరమణ, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, ఇతర పోలీస్ అధికారులతో కలిసి హరిపిరాల క్రాస్ రోడ్డు నుంచి బస్టాండ్ మీదుగా డివైడర్ చివరి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన తిరిగారు. హైస్కూల్ ఆవరణలో ఉన్న కూరగాయల మార్కెట్, ఎస్బీఐ బ్యాంక్, తొర్రూరు బస్టాండ్ ముందు, ఎల్వైఆర్ గార్డెన్ రహదారిలో ఉన్న వ్యాపార సముదాయాలను, జంక్షన్లలో వాహనాల రద్దీని పరిశీలించారు. ఉదయం 10 తర్వాత ప్రధాన రహదారితోపాటు గల్లీలు, ముఖ్యకూడళ్లలో ఎవరైనా సం చరిస్తున్నారా అనే విషయంపై డ్రోన్ కెమెరాతో వీక్షించారు. స్వయంగా డ్రోన్ కెమెరాను ఆపరేటింగ్ చేసి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని గల్లీల్లో పోలీసులు ముమ్మరంగా గస్తీ నిర్వహించడంతోపాటు అనవసరంగా రోడ్ల పైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలన్నారు. లాక్డౌన్ను మరింత పటిష్టంగా అమలుపర్చేందుకు ముఖ్య కూడళ్లు, రోడ్లపై వాహనదారులు, ప్రజల కదలికలను గమ నించేం దుకు డ్రోన్ కెమెరాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ కరుణాకర్రావు, కమిషనర్ గుండె బాబు, ఎస్సై నగేశ్, పోలీస్సిబ్బంది పాల్గొన్నారు.