చెరువులు నిండితే కేసీఆర్కు ఎంతో సంతృప్తి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
పోచన్నపేట చెక్డ్యాం వద్ద సీఎం చిత్రపటానికి పూలాభిషేకం
బచ్చన్నపేట, జూలై 25 : కరువు, దుర్భిక్ష ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ ఆశయమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పోచన్నపేటలో నిండిన చెక్డ్యాంను పరిశీలించారు. రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి చెక్డ్యాం వద్ద సీఎం చిత్రపటానికి పూలాభిషేకం చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకప్పుడు తాగు, సాగునీటికి ఎన్నో తిప్పలు పడ్డ ఈ ప్రాంతం కేసీఆర్ చలువతో సస్యశ్యామలమైందన్నారు. గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. పోచన్నపేటలో రూ.13 కోట్లతో మూడు చోట్ల చెక్డ్యాంలు నిర్మించగా, అవి ఇప్పుడు జలకళను సంతరించుకున్నాయన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి మండలంలోని పోచన్నపేట వాగు వరకు గోదావరి జలాలను రప్పించినట్లు తెలిపారు. దీంతో పోచన్నపేట, సదాశివపేట, నారాయణపూర్, చిన్నరామన్చర్ల, యాదాద్రి జిల్లా కొలనుపాక గ్రామాల్లోని బోరుబావుల్లో నీటిమట్టం పెరిగిందన్నారు.
రైతు ప్రయోజనాల కోసం కేసీఆర్ పనిచేస్తుంటే, ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యంగా ప్రతి సభ, సమావేశంలో సీఎం కేసీఆర్ బచ్చన్నపేట మండలాన్ని గుర్తు చేయడం అభినందనీయమన్నారు. చెరువులు, కుంటలు, చెక్డ్యాంల్లో నీళ్లు చూస్తే కేసీఆర్కు భోజనం చేయకున్నా కడుపునిండా తిన్నట్లు అవుతుందన్నారు. పోచన్నపేట వాగుపై మరో రెండు చెక్డ్యాంలు ఏర్పాటు చేయాలని, మత్తడి నుంచి అవతలి వరకు వెళ్లే విధంగా రోడ్డు సౌకర్యం కల్పించాలని రైతులు కోరగా, వెంటనే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అరుణాఅయిలయ్య, మండల అధ్యక్షుడు చెంద్రారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సతీశ్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కనుకయ్యగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు షబ్బీర్, మండల నాయకులు ఫిరోజ్, సిద్దారెడ్డి, చల్లా శ్రీనివాస్రెడ్డి, మహేందర్రెడ్డి, ఉపేందర్రెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు.