ములుగురూరల్/ వెంకటాపూర్/ మహాముత్తారం/ మంగపేట/ కాటారం/మల్హార్, నవంబర్24: ములుగు మండలం రాయినిగూడెం, పెగడపల్లి, పంచోత్కులపల్లి, జగ్గన్నపేట గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను బుధవారం డీఆర్డీవో నాగపద్మజ ప్రారంభించారు. ‘ఏ’ గ్రేడ్కు రూ.1960, ‘బీ’ గ్రేడ్కు రూ.1940 మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం రవి, సీసీ సునిత, కమిటీ సభ్యులు, వీఓఏలు పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేటలో ఆదర్శ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. సీసీ సంపత్రెడ్డి, ఆదర్శ వీవో సంఘం అధ్యక్షురాలు అరుణ, కార్యదర్శి కవిత, సభ్యులు పాల్గొన్నారు. మహాముత్తారం మండలంలోని నిమ్మగూడెం, కోనంపేట గ్రామాల్లో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలను ఇన్చార్జి తహసీల్దార్ వినయ్సాగర్, జీసీసీ మేనేజర్ హరిలాల్ ప్రారంభించారు. మాదారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అజీమాబేగం, సింగిల్ విండో డైరెక్టర్ అల్లాఉద్దీన్, వజినేపల్లిలో సింగిల్విండో డైరెక్టర్ మల్లమ్మ, సీఈవో శ్రీధర్ ప్రారంభించారు. మంగపేట మండలంలోని రమణక్కపేట, తిమ్మంపేట, బాలన్నగూడెం గ్రామాల్లో సెర్ఫ్ డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేశ్, ఏపీఎం అప్పారావు ప్రారంభించారు. చెరుపల్లిలో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ సామా మోహన్రెడ్డి, సహకార చైర్మన్ రమేశ్ ప్రారంభించారు. సహకార డెరెక్టర్ అచ్చ సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, చిట్టిమల్ల సమ్మయ్య, టీఆర్ఎస్ మండల సోషల్ మీడియా ఇన్చార్జి శ్రీహరి, కొనుగోలు కేంద్ర ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు. కాటారం మండలంలోని కొత్తపల్లి, అంకుశాపూర్, చింతకాని గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ వైస్ చైర్మన్ దబ్బెట స్వామి ప్రారంభించారు. సర్పంచ్లు రఘురాం, అయిలి సుమలత, దబ్బెట సరోజన, ఎంపీటీసీ విజయారెడ్డి, డైరెక్టర్లు రాజబాపు, ఐలయ్య, నాయకులు దబ్బెట రాజేశ్, కొసరి భాస్కర్ తదితరులున్నారు. మల్హార్ రావు మండలంలోని కొండంపేటలో తాడిచర్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ చెప్యాల రామారావు ప్రారంభించారు. సర్పంచ్ అడ్డూరి కుమారస్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయిని రాజయ్య, కోఆప్షన్ మెంబర్ ఆయుబ్ ఖాన్ పాల్గొన్నారు.