వేలాదిగా తరలిరావాలి
వార్డులు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించాలి
టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు జనార్దన్, పలిమెల, కాటారం మండలాల అధ్యక్షులు తిరుపతి, జనార్దన్
భూపాలపల్లి టౌన్ / పలిమెల/ కాటారం, అక్టోబర్ 23 : వరంగల్లో నవంబర్ 15న నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్ర జలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు కట కం జనార్దన్, పలిమెల, కాటారం మండలాల అధ్యక్షులు జువ్వాజి తిరుపతి, తోట జనార్దన్ పిలుపునిచ్చారు. శనివా రం భూపాలపల్లి పట్టణంలోని ఇందిరా భవన్లో అర్బన్, పలిమెల, కాటారం మండలకేంద్రాల్లో సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, పట్టణ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ రాష్ర్టాన్ని సాధించి, సాధించుకున్న రా ష్ర్టాన్ని విజయపథంలో నడిపిస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ ఆదర్శ పాలన అందిస్తున్నారన్నారు. ఇతర రాష్ర్టాలు మన పథకాలకు ఆకర్షితులవుతున్నారంటే కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. భూపాలపల్లి పట్టణంలోని వార్డుల వారీగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే వార్డుల వారీగా వార్డు కమిటీ నాయకులు సమావేశాలు నిర్వహించుకుంటూ విజయగర్జన సభ విజయవంతంకు కృషి చేయాలని కోరారు.
నూతన కమిటీల ఏర్పాటు అనంతరం మరింత నూతన ఉత్తేజంతో పార్టీ పటిష్టతకు ప్రతీ ఒక్కరూ పని చేయాలన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ఈ నెల 27న టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అధ్వర్యంలో మంథనిలో జరిగే సన్నాహక సమావేశానికి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని తిరుపతి కోరారు. భూపాలపల్లిలో జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, హనుమాన్ దేవాలయ చైర్మన్ గడ్డం కుమార్రెడ్డి, అర్బన్ మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నేతలు బుర్ర రమేశ్, తాటి అశోక్, బండారి రవి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు పాల్గొన్నారు. పలిమెలలో జరిగిన సమావేశంలో యూత్ అధ్యక్షుడు లంగారి రవీందర్, మాజీ మండలాధ్యక్షుడు లాట్కరి వెంకటేశ్, సర్పంచులు ఆలం సత్యనాయణ, చిడం నాగయ్య, జవ్వాజి పుష్పలత, నాయకులు, జనగామ శ్రీనివాస్, మడే సత్యనారాయణ, తోట రమేశ్, మండల బీసీ విభాగం అధ్యక్షుడు నామని నర్సింహులు పాల్గొన్నారు. అలాగే కాటారంలో జరిగిన సమావేశంలో ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు భూపెల్లి రాజు, ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కుడుదుల రాజబాపు, టీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు రామిళ్ల కిరణ్, మహిళా అధ్యక్షురాలు ఎలుబాక సుజాత, నాయకులు తులిసెగారి శంకరయ్య, జోడు శ్రీనివాస్, దబ్బెట రాజేశ్, నరివెద్ది శ్రీనివాస్, సడువలి, కుమ్మరి అశోక్, బాపు, శేఖర్, రాజబాపు, కొండగొర్ల గట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.