మండలం నుంచి 5వేల మందిని తరలించాలి
నెల్లికుదురులో ఎమ్మెల్యే శంకర్నాయక్
నెల్లికుదురు, అక్టోబర్ 23: విజయగర్జన సభకు ప్రజలను అధిక సంఖ్యలో తరలించి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలానికి నిర్దేశించిన 5వేల మందిని సభకు తరలించేలా ప్లాన్ చేయాలన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు చేసింది గోరంత.. జేబులు నింపుకున్నది కొండంత అని అన్నారు. అభివృద్ధి అంటే ఆమడదూరంలో ఉండే పార్టీల నాయకులు మాట్లాడే గారడి మాటలకు గాయబ్ కావొద్దని, ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపి చెంప చెల్లుమనిపించాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి అధిష్ఠానం సముచిత గౌరవం ఇస్తుందన్నారు. సభను సక్సెస్ చేయడంలో నాయకులు కార్యకర్తలు, నాయకులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కోరారు. మహబూబాబాద్లోని ముకుంద థియేటర్లో నేడు ఆర్ నారాయణమూర్తి తీసిన రైతన్న సినిమా ప్రదర్శించనున్నామని, గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుపాటి వెంకట్రెడ్డి, దర్శనం భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, రైతుబంధు సమితి జిల్లా, మండల కో ఆర్డినేటర్లు భూక్యా బాలాజీనాయక్, కాసం వెంకటేశ్వర్రెడ్డి, నెల్లికుదురు సర్పంచ్ యాదగిరిరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, సొసైటీ చైర్మన్లు వెంకన్న, దేవేందర్ రావు, మండల అధికారప్రతినిధి వినోద్రెడ్డి, మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు అనిల్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భీముడు, తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహబూబాబాద్ రూరల్: పేదల సంక్షేమమే ధ్యేయం గా కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో 13 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాడని అన్నారు. సర్కా రు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఎం ఫరీద్, గద్దె రవి, మార్నేని వెంకన్న, సుధగాని మురళి, నాయిని రంజిత్, అశోక్నాయక్, చిట్యాల జనార్దన్, మురళి, సైదులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్నాయక్ పట్టణంలోని ఏరియా వైద్యశాలలో భవన నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యతతో నిర్మించాలని ఏఈ, డీఈలకు సూచించారు. అక్కడి నుంచి అండర్ బ్రిడ్జి వద్దకు వెళ్లి సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. ఆయన వెంట పర్కాల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.