పాలకుర్తి రూరల్, అక్టోబర్ 23: వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు కృషి చే యాలని జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్ సూచించారు. శనివారం మండలంలోని గూడూరు, పాలకుర్తి ప్రభుత్వదవాఖానలో వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడుత వ్యాక్సినేషన్ను వంద శాతం పూర్తి చేశామన్నారు. రెండో విడుత వ్యాక్సినేషన్ త్వరలో వందశాతం పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్యులకు సూచించారు. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ వేయాలన్నారు. విధుల్లో సిబ్బంది ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఉప వైద్యాధికారి సుధీర్, వైద్యులు టీ ప్రియాంక, జీ యామిని, సిబ్బంది నాగరాజు, ఖయ్యూం, సల్మాన్, రాజు, ప్రేమలత, ఏఎన్ఎం చంద్రకళ ఉన్నారు.
నర్మెట: వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఎంపీడీవో ఖాజానయిమొద్దీన్ సూచించారు. శనివారం ఆగాపేట, వెల్దండ, హన్మంతాపూర్, బొమ్మకూర్, తదితర గ్రామాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట వైద్యులు సిద్దారెడ్డి, ఎంపీవో ఘపూర్, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.