మేయర్ గుండు సుధారాణి
కమిషనర్తో కలిసి వివిధ రాష్ర్టాల మున్సిపల్ అధికారులు, యూనిసెఫ్ ప్రతినిధులతో సమావేశం
వరంగల్, అక్టోబర్ 22 : చారిత్రక వరంగల్ మహా నగరాన్ని భావితరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసేం దుకు కృషి చేస్తున్నామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. శుక్రవారం కమిషనర్ ప్రావీణ్యతో కలిసి నగర పర్యటనకు వచ్చి న వివిధ రాష్ర్టాల మున్సిపల్ అధికారులు, యూనిసెఫ్ ప్రతిని ధులతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలు, సూచనలకు అను గుణంగా నగరాభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా మని అన్నారు. అమృత్ 2.0లో భాగంగా నగరంలో అండర్ డ్రైనేజీకి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. దేశంలోనే తొలి మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ అమ్మవారిపేటలో ఉందని, 150 కేఎల్బీ సామర్థ్యం కలిగిన మరో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బల్దియాలో స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ పక్కాగా జరుగుతున్న దని వివరించారు. ప్రతి రోజూ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 404 టన్నుల చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నా మని తెలిపారు.
రాంపూర్లోని డంపింగ్ యార్డులో మిధనైజే షన్ ప్లాంట్ ద్వారా 18 మెట్రిక్ టన్నుల చెత్తను కంపోస్ట్ చేస్తు న్నామని ఆమె అన్నారు. రెండు ఆర్గానిక్, 2 విండో కంపోస్ట్ ప్లాంట్లను నిర్వహిస్తున్నామని, 25 డీఆర్సీసీ సెంటర్ల ద్వారా ప్రతి రోజూ 18 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను వేరు చేస్తున్నా మని మేయర్ వివరించారు. డ్రై, హార్డ్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ కోసం 3 యంత్రాలు పనిచేస్తున్నాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరు గైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తున్నామని ఆమె అన్నారు. 2019 డిసెంబర్ నుంచి నగరంలో ప్లాస్టిక్ నిషేధించామని, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెడుతున్నామని ఆమె అన్నారు. కమిషనర్ ప్రావీణ్య మా ట్లాడుతూ 2019లో నగరం ఓడీఎఫ్ ప్లస్గా ప్రకటించబడింద ని, దానిని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నామని అన్నారు. మహి ళల భాగస్వామ్యంలో మోడల్ శానిటేషన్ సిటీగా తీర్చిదిద్దుతు న్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వ యంతో పనిచేస్తూ అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మున్సిపల్ అధికారులు, యూనిసెఫ్ ప్రతినిధుల కు మేయర్ సుధారాణ జ్ఞాపికలు అందజేశారు. సమావేశానికి ముందు ప్రతినిధుల బృందం నగరంలోని పలు పబ్లిక్ టా య్లెట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎంజీఎం, అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్ద నిర్మించిన ఎస్టీపీలు, కా ర్పొరేషన్ అవరణలో నిర్మించిన షీ టాయ్లెట్లను పరిశీలించా రు. అనంతరం అమ్మవారిపేటలో మావన మల వ్యర్థాల శుద్ధీక రణ కేంద్రాన్ని సందర్శించారు. సమావేశంలో ఆస్కీ డైరెక్టర్ శ్రీనివాసాచారి, ప్రతినిధి రాజ్మోహన్ పాల్గొన్నారు.