జనగామ చౌరస్తా, జూలై 22 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను ఇండియన్ కరెన్సీపై ముద్రించాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కోరుతూ అంబేద్కర్ ఫొటో సాధన సమితి నేతృత్వంలో వచ్చే నెల ఆగస్టు 3, 4, 5 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ను గురువారం ఆయన జనగామలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్ మాట్లాడు తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే దేశంలో చిన్నరాష్ర్టాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరశురాములు, డాక్టర్ పీ సుగుణాకర్రాజు, రాజు, ప్రభాకర్, జీ రాజు, సాగర్ పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
తరిగొప్పుల :మండలంలోని పోతారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంగ బాలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబాన్ని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ గురువారం పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ జొన్నగోని హరితాసుదర్శన్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, ఎంపీటీసీ భూక్యా జూంలాల్ నాయక్, సర్పంచ్లు దామెర ప్రభుదాస్, ముక్కెర బుచ్చిరాజు యాదవ్, నాయకులు చెన్నూరి సంజీవ, వంగ రామరాజు,ఎండబట్ల వెంకటేశ్, నూకల కృష్టమూర్తి, తాళ్లపల్లి పోషయ్య గౌడ్, అర్జుల సుధాకర్రెడ్డి, అంకం రాజరాం, మల్యాల సుధీర్, బైరగోని రాజు ఉన్నారు.