ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్
ములుగు జిల్లా కేంద్రంలో వర్ధంతి సభ
ములుగురూరల్, అక్టోబర్ 20 : ఆదివాసీల అస్తిత్వం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు, నిరంకుశ రాజుల పరిపాలనకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించిన మహోన్నత వ్యక్తి కుమ్రం భీం అని ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పొదెం కృష్ణ ప్రసాద్ అన్నారు. కుమ్రం భీం వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, నాయకపోడు దెబ్బ ఆధ్వర్యంలో డీఎల్ఆర్ గార్డెన్ నుంచి ఎస్సీ కాంప్లెక్స్ వరకు ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఆదివాసీ హక్కుల చట్టాల కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి కుమ్రం భీం అని, జల్ జంగిల్ జమీన్ నినాదంతో పోరాటాలు చేసినట్లు తెలిపారు. ములుగు జిల్లాకు సమ్మక్క-సారలమ్మ పేర్లను ప్రభుత్వం నామకరణం చేయాలని అన్నారు. అలాగే కుమ్రంభీం విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, నాయకపోడు దెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బ సుధాకర్, జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతిగౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నర్సయ్య, నాయకులు చింత కృష్ణ, సరోజన, గాలి సమ్మయ్య, సారయ్య, జన్ను రవి, రాగుల శంకర్, బుర్ర సతీశ్, దేవేందర్, బద్దుల లక్ష్మి, శ్యామల, సదానందం, రవి, స్వామి, కోట నర్సింగం, మురళి, శ్రీలత, లక్ష్మయ్య, సారంగం, యాదగిరి పాల్గొన్నారు.
గట్టమ్మ దేవాలయం వద్ద
ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో కుమ్రం భీం వర్ధంతిని గట్టమ్మ దేవాలయం వద్ద ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య హా జరై భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మహిళా కార్యదర్శి గంటమూరి భాగ్యలక్ష్మి, ములుగు జిల్లా కార్యదర్శి సుమతి, నాయకులు కొత్త సదయ్య, అరిగెల సమ్మయ్య, ఆకుల మొగిలి, కల్యాణ్, పూర్ణచందర్, సంజీవ, రవి, చంద్రయ్య, సుభద్ర, మహేందర్, కుమార్, రాకేశ్, నీలమ్మ, కొమురమ్మ పాల్గొన్నారు.