జనగామ నమస్తే తెలంగాణ, అక్టోబర్ 20 : వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికీ ఆదర్శ ప్రాయమని కలెక్టర్ శివలింగయ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భం గా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహనీయులు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. మొదటి సారిగా సంస్కృతంలో శ్లోకాలను రచించినందున వాల్మీకి మహర్షిగా ఆది కవిగా, రామాయణానికి ఆది కావ్యంగా పేరు వచ్చిందని పేర్కొన్నారు. మనిషిలో మార్పు వస్తే మహర్షి కాగలరని నిరూపించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వాల్మీకి మహర్షి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, అబ్దుల్ హామీద్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి రవీందర్, డీఆర్డీవో రాంరెడ్డి, డీఎంహెచ్వో మహేందర్, జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ సుగుణాకర్రాజు, కలెక్టరేట్ ఏవో రంగరాజు మురళీధర్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నర్మెట: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో వాల్మీకి మహర్షి జయంతి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీ కోప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, ఎంపీడీవో ఖాజానయిమొద్దీన్, నర్మెట, తరిగొప్పుల మండలాల టీఆర్ఎస్ కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, ఎంపీవో గపూర్, కార్యదర్శులు సంతోష్, వినయ్, రిజ్వాన్, టైపిస్టు అనురాధ, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు ఎల్లబోయిన నరేశ్, టీఆర్ఎస్ నాయకులు ఇట్టబోయిన రమేశ్, కుంటి రమేశ్, కాదునూరి అమర్నాద్, ఎల్ శివ, ఎల్ మహేశ్ పాల్గొన్నారు.
బచ్చన్నపేట: వాల్మీకి జయంతి వేడుకలు బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొని వాల్మీకి జ యంతి నిర్వహించారు. ఎంపీడీవో రఘురామకృష్ణ, ఏపీ ఎం జ్యోతి, ఎంపీటీల పోరం మండలాధ్యక్షుడు దూడల కనుకయ్యగౌడ్, మండల కోఆప్షన్ మెంబర్ షబ్బీ ర్, ఎంపీటీసీలు కర్ణాల వేణుగోపాల్, లలితానర్సిరెడ్డి, కార్యాలయ సిబ్బంది పంకజ, కృష్ణ, రాజ్కుమార్ పాల్గొన్నారు.
పాలకుర్తి రూరల్: మండలంలోని వల్మిడిలో ఆదికవి వాల్మీకి జయంతి సీతారామ చంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వా ల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ వీరమల్ల జైహింద్, ఎంపీటీసీ తాళ్ల సోమనారాయణ మాట్లాడుతూ వాల్మీకి ఆది కవి అన్నారు. ఆయన రాసిన రామాయణం గొప్ప కావ్యమన్నారు. నాటి వాల్మీకపురం నేటి వల్మిడి అన్నారు. లవకుశుల జన్మస్థలమని చెప్పారు. వాల్మికి రాసిన పద్యాలను పాడి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సుధాకర్, వీరమల్ల దేవేందర్, రాపర్తి రామస్వామి, భారత వెంకన్న, పర్వత వెంకటయ్య, భారత శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు.