ఆదిలాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో పల్లె, పట్టణ ప్రగ తి, హరితహారం కార్యక్రమాలు చివరిరోజు ఉత్సా హంగా సాగాయి. పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన గ్రీన్పా ర్కును ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. అనంతరం మొక్క లు నాటారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బజార్హత్నూర్ మండలం దేగామలో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సబ్స్టేష న్ ఆవరణలో ఎంపీపీ, జడ్పీటీసీతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామపంచాయతీలోని ధంపూర్ పార్కులో మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయం, నార్నూర్ మండలం తాడిహత్నూర్లో నిర్వహించిన హరితహారంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. మొక్కలు నాటి నీరుపోశారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు చివరిరోజు వెల్లువలా నిర్వహించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంలో నిర్మల్ పట్టణంలోని గాంధీపార్కులో 10 లక్ష ల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. ట్యాంకు పైకెక్కి నిర్మాణ పనులను పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్ కాలనీలో పల్లె, పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్తో కలిసి మొక్కలు నాటారు. లోకేశ్వరం మండలం రాజురా పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో పౌరసరఫరాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఒకే రోజు 30 నిమిషాల్లో 1000 మొక్కలు నాటారు. దీనికి ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన బాసరలో డివైడర్లపై మొక్కలు నాటారు. మండలంలోని లాబ్ధి గ్రామంలో ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. తానూర్ మండలం బొంద్రట్, బెల్తరోడ గ్రామాల్లో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు.