లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలో జితేంద్ర పాల్ (24) అనే యువకుడు కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో జితేంద్రపాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. జిల్లాలోని ఖగా ఏరియాలో ఈ ఘటన జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. తనపై ఓ బాలిక అత్యాచారం కేసు పెట్టడంవల్లే పాల్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
మృతుడు జితేంద్రపాల్పై ఈ నెల 4న అత్యాచారం కేసు నమోదైంది. జితేంద్రపాల్ తమ ఇంట్లోకి ప్రవేశించి అత్యాచార యత్నం చేశాడని స్థానికంగా ఉండే ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన జితేంద్రపాల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.