న్యూఢిల్లీ : వాయువ్య ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలోని ఓ నివాసంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది నాలుగు ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఫైర్మెన్తో సహా నలుగురు గాయపడ్డారని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ఫైర్మెన్ను అతన్ని రోహిణిలోని సరోజ్ ఆసుప్రతికి తరలించారు. ప్రమాదం ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయపడ్డారు. అయితే, అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.