అమర సైనికులకు యువజన సంఘాల నివాళి

దేవరుప్పుల, ఫిబ్రవరి 14 : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత సైనికులకు యువజన సంఘాల సభ్యులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని పెద్దమడూరులో ఆదర్శ యువజన మండలి అధ్యక్షుడు చంద్రగిరి సంపత్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ దేశ రక్షణకు రేయింబవళ్లు శ్రమిస్తున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. పాకిస్తాన్ కుయుక్తులను తిప్పికొడుతున్న సైనికుల కు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ దర్శ యువజన మండలి కార్యదర్శి బింగి ప్రశాంత్, కన్వీనర్ మానుపాటి ఉపేందర్. కోశాధికారి దేవర సోమన్న, గొడిశాల బాలరాజు, కారుపోతుల శ్రీనివాస్, గొరిపల్లి సంపత్, కొండ మహేశ్, ముత్యాల నరేశ్, గొడిశాల రంజిత్, ప్రదీప్ పాల్గొన్నారు.
లింగాలఘనపురంలో..
లింగాలఘనపురం : మండలంలోని గుమ్మడవెళ్లిలో యూత్ సభ్యులు అమర జవాన్లకు నివాళులర్పించారు. ఆదివారం స్థానిక సర్పంచ్ కత్తుల శ్రీపాల్రెడ్డి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాకిస్తాన్ దురాగతాలను అడ్డుకుంటూ దేశరక్షణకు పాటుపడుతున్న సైనికుల త్యాగాలు మరువలేనివన్నారు.
తాజావార్తలు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
- పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్
- షాకింగ్.. బాలుడిపై లైంగికదాడి
- 22 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు కూలడం వల్లే..