కంటోన్మెంట్, జూన్ 24: పేదలకు అండగా ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. మోం డా డివిజన్ వైఎంసీఏ సమీపంలోని ప్రతిభ అపార్ట్మెంట్లో నివసించే జోసెఫ్ సామ్యూల్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. జోసెఫ్ వైద్య ఖర్చులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందున విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి రూ.2 లక్షల ఎల్వోసీని మంజూరు చేసి ఆ పత్రాలను కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం అందజేశారు. ఎమ్మెల్యే సాయన్నకు, ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని జోసెఫ్ తెలిపారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నివేదిత, సంతోష్, మార్కెట్ డైరెక్టర్ మహంకాళి శర్విన్, అక్తర్, లక్ష్మీపతిగౌడ్ పాల్గొన్నారు.
మారేడ్పల్లి, జూన్ 24 : మోండా మార్కెట్ డివిజన్ లో తాగునీటి , డ్రైనేజీ సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. గురువారం కుమ్మరిగూడలో కార్పొటర్ దీపికతో కలిసి రూ. 12 లక్షలతో చేపట్టిన డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
రెజిమెంటల్బజార్లో బస్తీ దవాఖానను ఏర్పాటుచేయాలని ప్రజలు ఎమ్మెల్యే సాయన్నను కోరారు. పాత గోపాలపురం పోలీసు స్టేషన్ తో పాటు మరికొన్ని ప్రదేశాలను పరిశీలించి బస్తీ దవాఖానను కేటాయించేలా అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.